పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/143

ఈ పుటను అచ్చుదిద్దలేదు

చింతలపల్లి వీరరాఘవుడు.


ఈకవి మధురవాణీవిలాస మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచియించి శ్రీ వేంకటేశ్వరస్వామి కంకితము చేసెను. కవి నియోగిబ్రాహ్మణుడు; ఆశ్వలాయన సూత్రుడు; వీరరాఘవ పౌత్రుడు; వేంకటార్య పుత్రుడు. కవి తన్నుగూర్చి మిత్రు లన్నట్లుగా దనగ్రంథమునం దీక్రిందిపద్యములను జెప్పికొనెను