ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

ఆనందమఠము


లేదు. వానికి ఏదియు తోఁప లేదు, జీవచ్ఛకమువలె యట్లే నేలపై పరుండినాఁడు.


మూఁడవ ప్రకరణము

కల్యాణి తప్పించుకొనుట

దొంగలు కల్యాణిని ఎత్తుకొనిపోయి విడిచినవనము మిగులమనోహరమై యుండెను. వెలుతురు చొర వీలులేని స్థితిలో నుండెను. ఆరణ్యశృంగారమును వీక్షించుటకు వేయి కన్ను లైనచాలవు. దరిద్రుని హృదయాంతర్గత మైన సౌందర్యమువలె, ఆవనసౌందర్యము అదృష్టమైనదిగ నుండెను. చూచినవారే లేరు. గ్రామములలో ధాన్యము లేకపోయినను వనమునందుమాత్రము పుష్పము లుండెను. పుష్పము లాయంధకారమునందు వెన్నెలవలె నుండెను. దొంగలు, కల్యాణిని దానికూఁతును కోమలమైన తృణశయ్యయందు పరుండఁ జేసి, యండఱు పరివేష్టించి కూర్చుండి పరస్పరము మాటలాడఁ దొడంగిరి. కొంద 'ఱీమెను దీసికొనిపోయి యేమి చేయవలయును?' అనిరి. అంతలోఁ గొందఱు ఈమెయొద్దనుండునగలను ముందే తీసికొనియైన' దనికి. మఱికొందఱు 'దాని నంతయు భాగించుకొనవలయు' ననిరి. అట్లే భాగించికొనిరి. ఒక దొంగ'వెండి బంగార మెందులకు? ఎంతటి మంచినగ లిచ్చినను నొక పిడికెడు కూడు దొరకుట 'లేదు. ఆఁకలిచే ప్రాణము పోవుచున్నది. ఈదినము ఆకులను తింటిని. నాకు నగ లేల?' అనెను.