ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

ఆనందమఠము


సమీపమున నుండు గ్రామముపోయి చేరవలయు సని తలంచి బయలు దేఱి యెండలో నడుగిడుటకు కాక మెల్లమెల్లగా సాయంకాలమున కొక చిన్న గ్రామము పోయి చేరిరి. గ్రామము నకు పోయి చేరినతోడనే మహేంద్రుఁడు నీళ్లు తెచ్చి భార్యకును బిడ్డకు నిచ్చి, ఆహారమును సంపాదింపవలయు నని యాలోచించుచుండెను. ఏమి దొరకును ! ఆ గ్రామములో నొకమనిషి యైన కనఁబడ లేదు. పెద్ద పెద్దయిండ్లున్నవి. ఉన్ననేమి? ఎవరును లేరు. మహేంద్రుఁడు తిరిగితిరిగి వేసారినాఁడు. ఏయింటిముందు నిలిచి కేక వేసినను “ఏమి” అను బదులు లేదు. తర్వాత భార్యను జూచి—— నీవు బిడ్డను పెట్టుకొని కొంచెము సేపు ధైర్యము తెచ్చికొని యీయింటి యరుగుమీఁదఁ గూర్చుండియుండుము. నేనుపోయి శ్రీక్రుష్ణుని దయవలన నేక్కడ నైన పశువు లున్నయెడల పాలుపితికి తెచ్చెదను. అని చెప్పి యచ్చట 'రాసులు రాసులుగా పడియున్న పాత్రలలో నొక దానిని గైకొని వెడలి పోయెను.


రెండవ ప్రకరణము

కళ్యాణి చోరుల పాలగుట

మహేంద్రుఁడు వెడలిపోయెను, కల్యాణి బిడ్డను పెట్టుకొని యొక్క తెయే దీపము లేని జనశూన్యమైన యింటియందుఁ గూర్చుండి నలువైపులఁ జూచుచుండెను, మిగుల భయమయ్యెను. ఎక్కడ నెవ్వరును లేరు. మనుష్యశబ్దమే లేదు. కుక్కల నక్కల కూఁతలుతప్ప, వే ఱేదియు వినఁబడదు. తన మనస్సు