ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

అ శో కుఁ డు

ముఱి యేమగునో మే మెంతమాత్రము నూహలవలన నిర్దేశింపఁ కాలము, అప్పు డేమగునో చెప్పఁ జాలము కాని, పిత్రాజ్ఞా పరిపాలన తత్పరత సాహసము, నీతికుశలత మొదలగు రాజ కులోచిత సద్గుణగణంబులన్నియు నశోకునియందు మూర్తీభవించియున్నట్లు పొడకట్టుట చే నిప్పుడు మహారా జాతని యెడలఁ బరమాదర భావము నే సూచింపఁదొడంగెను.

ఆ సమయమునకు సరిగ నుజ్జయనీ మండలమును బ్రజానుకూలముగఁ బరిపాలించుటకుఁ దగినసమర్థు డగు రాజప్రతినిధి నొకని నియమించుట యావశ్యక మయ్యెను. ఎంతటి సమర్థు లైనను దనయుద్యోగి జనులయందింతటి మహోన్నత కార్యభారమును బెట్టుటకు మహా రాజున కిష్టము లేక పోయెను. ప్రకృతమునం దశోకుడు సకల సద్గుణగరిష్టుండనియు, నసామాన్య ప్రతిభాశాలియనియు ననుభవమునం దోఁచుటచే సార్వభౌముఁ డగుబిందుసారుఁడు బాగుగ నాలోచించి యవంతీమం డలరాజప్రతినిధి పదంబున కశోక కుమారుఁడే యర్హుఁడని నిశ్చయించి యావిధముగ నియోగించి యాతని నచ్చటికిఁ బంపిం చెను.

ఇందూరునకు సమీపమున నవంతీనగర నామ మెల్ల వారికిని బరిచిత మైనదియే. స్థలమాహాత్మ్యము చే నిప్పటికినా పవిత్రనామము సుప్రసిద్ధముగ నే యున్నది——

"అయోధ్యా, మధురా, మాయా, కాశీ, కాంచీ, అవంతికా
పురీ ద్వారావతీ చైవ, సప్తెతా మోక్ష దాయి కాః !! "

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/46&oldid=333561" నుండి వెలికితీశారు