ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

అడిదము సూరకవి.


మహారాజునకుఁ బద్యరూపమగునీయర్జీ పంపుకొనినను గార్యము లేకపోయెను. గుత్తదారుఁడగు అన్నమరాజుగారి వలనఁగాని తన ప్రభువులగు విజయనగరా ధీశులవలనఁ గాని తనకుఁగలిగిన బాధతొలఁగ కుండుటచేత వేవొండు చేయునది లేక యొక నాఁటియుదయమున రామన స్నానసంధ్యాను స్థానములు నిర్వర్తించుకొని తాటాకులు గంటము చేత నిడుకొని పొలము నకుఁ బోయెను. నీటిముంపు చేతఁ జెడుచున్న సస్యమును జూచి విచారించి తన బాధతొలఁగుటకుఁ దన కవితయే శరణమనియెంచుకొని కుత్తుక బంటి నీటిలో నిలువఁబడి గంగాభవానిని నుతించుచు నిట్లికపద్యమును వ్రాసి నాసిన 'తాటియాకును నీటి లోవిడిచెను.

<సీ. బ్రహ్మాండ ఖాండసం • పత్తి కుక్షిని గల్గు
పద్మ నాభుని పదా • బ్జమునఁ బుట్టి
సకలరత్నాకర • స్థానమై యుప్పొంగు
నంబుధీశునిచర ణంబు దొక్కి,
పరమతత్వజ్ఞుఁడై , పరఁగళంతను మహీ
రమణువామాంక భా • గమునఁజేరి
యఖిలలోకాధ్యక్షుఁ * డై మించి విహరించు
శివుజటాజూటాగ్ర సీమ నిలిచి


తనరునీవంటీ ధన్య కు త్తమము గాదు
పూసపాటీమహాస్థాన , భూమియందుఁ
గాలు దొక్కంగ నోడుఁజం , డాలుఁడయినఁ
గదలు మిట మానీ దివిజగం , గాభవాని.