ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

అడిదము సూరకవి.


ఈశ్వరానుగ్రహముచే నయ్యది నేఁటివఱకు నీవంశజుల యనుభ వములోనే యున్నది. వారిలో నొకకుటుంబము వారు రేగలోనే నివసించుచుఁ గరణికము నేఁడును జేయుచున్నారు. ఆ కుటుం బమువారిలో నొకఁడగు రామకవియే యీపద్యములను జెప్పెను.

...." అడిదమువారి యినాము భూములు అనుముల చెఱు” వనునొక చెఱువు ' కిందనున్నవి. ఈ యినాముభూముల మళ్ళ లోఁగొన్నిటిన త్తి నోముల చెఱునను నింకొక చెఱువు గలదు. ఈ నోముల చెఱువు పూర్తిగ నిండినపుడు మిరాశీ యినాము భూములలోఁ గొన్ని మళ్ళకు ముంపుగలుగును. ఆ నాఁటికాల మున నీ రెండవ చెఱువు పూర్తి గా నిండియుండ 'రామకవి మొ దలగు వారి భూములకు ముంపువలన " సస్య నష్టము గలిగెను. అంత రామకవి "రేగగ్రామము గుత్తదారగు దంతులూరు, అన్న మరాజుగారితోఁ దనకుఁ గలిగిన నష్టమును గూర్చి చెప్పుకొని నీటిముంపుతీయింపుఁడని యతనిని వేడుకొనెను. కాని అన్నమరాజుగారు రామకవి ప్రార్థకనలను బెడచెవినిఁ బెట్టిరి. కవికిఁగలిగిన బాధ తొలఁగసాధనము లేకుండెను. అంత రామకవి యీసమాచా రమంతయుఁ దన యేలికయగు శ్రీ విజయరామ గజపతి మహా రాజుసకుఁ దెలుప నిశ్చయించుకొని యొక యర్జీని బద్యముల తో వ్రాసి యామహా రాజునకుఁ బంపుకొనెను. ఆపద్యముల కే యర్జీద్యములని వాడుక. అవియిందుఁ బొందుపంచు చు న్నాఁడను.