ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

చెఱువుమీఁది పద్యములు.

(కృతికర్త అడిదము రామకవి.)


ఈపద్యములు సూరకవి ప్రణీతమని సామాన్యమగువాడుక. కాని యియ్యది మాకుటుంబములోఁ బారంపర్యముగ వచ్చచున్న వాడుకకు విరుద్ధము. కాఁబట్టి పద్యముల కృత్వమును గొంతవఱకుఁ జర్చించి యందలి సత్యాసత్యములు పా ఠకమహాశయులకు విశదపజచెదను.

ఈ వంశజుల చే మూలపురుషుఁడుగ నెన్నఁబడు నడిదము నారప్పకు * శ్రీవిజయనగర సంస్థాన ప్రభువులలో నొకర గు కృష్ణమరాజు మహారాజులుంగారు రేగయను గ్రామమునఁ గరణికము చేయుటకుఁ గొంతమాన్వమును దయచేసిరి. .


  • * యీయినాం సుమారు 300 సంవత్సరములకిందటస్నదుదార్కు (అడిదం నారప్పకు) మజ్కూరు మిరాశీ పని చూడగలందులకు శ్రీ యర్ర కృ ష్ణం దేవు శ్రీ నల్ల కృష్ణం దేవు మహారాజులం గార్లు మజ్కూరులో కొంతమా న్యం దయ చేయించినారు. " మహా రాజశ్రీ జి. యన్ . టయలరు యస్కోయరున్దొరవారి యినాముల దరియాప్తులో చేరిన విశాఖపట్నం జిల్లా యిల్కావియనగరం సమస్థానం బాపతు భీమునిపట్నం సబు మేజ స్త్రీటు యిల్కా అన్నమరాజు "రేగ మిరాశీదార్లు ఆడిదం నారాయణప్ప సన్యాసిరాజు వగై రాలు దాఖలు చేసిన స్టేటు మెంటు, స్న 1727ఫసలీ 1892 సంవత్సరం.

10