ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ప్రకరణము.

67


యుఁబ్రత్యుత్తరముగఁ జెప్ప లేకపోయెను. అంతనచ్చట భోజనమును జేయు చున్న వారంద ఱామె సమయస్ఫూర్తిగఁ జేసిన పరియాచకమున కెంతయు సంతసించిరి.


ఇటులనే యీపద్యములలోఁ గొన్నిటికి "గాధలుకలవు. ఆ కారణముచేత నీ పద్యములు ప్రస్తావవశముగఁ జెప్పబడిన వని యూహించుట యుక్తమని నాకుఁదోఁచెడిని.

ఆఱవప్రకరణమునం దుదహరింపఁ బడిన

మ. కరుణాసాగర ! పొణ్గుపాటికుల వేం • కట్రామదాను న్వమం
ధరయందుంచక స్వర్గలోకమునకున్ దర్లించినావేమి ? త
త్పురిఁగల్పాదులు లేవె యాచకులకున్ • భూయాచక శ్రేణి కె.
వ్వరు(ది క్కేమిది) ? మొండి జగ్గఁడవుఁగా • వా ? నెట్టి నై పల్కితిన్ "

అను నీపద్యము వేంకటమంతి స్వర్గస్థుఁడై న పిదపఁగవి చేఁ జెప్పఁబడినది. ఇయ్యది యామంత్రివరుని యెడలఁ గవికిఁగల గౌరవాతిశయమును దేటపటచుటయే గాక యాతని వితరణాది సుగుణసంపదనుగూడ విశదపజచు చున్నది. కారణజన్ముఁడని చెప్పఁదగిన యీమంత్రి శిఖామణి క్రీ!! వె|| 1780 సంవత్సర ప్రాం తమునఁ గీర్తి శేషుఁడై యుండవచ్చును.