ఈ పుట అచ్చుదిద్దబడ్డది



ఏడవ ప్రకరణము -

కవి కాశ్రయుఁడైన పొణ్గుపాటి వేంకటమంత్రి .

18 వ శతాబ్దమధ్యమున శృంగవరపుకోట జమీని బరి పాలించు చుండిన శ్రీముఖీ కాశీపతి రాజుగారికి నీపొల్గుపాటి వేం కటమంత్రి మంత్రిగానుండెను. ఇతఁడు గోలుకొండ వ్యాపారి శాఖలోఁ జేరిన బాహ్మణుఁడు. శ్రీవత్సగోత్రుడు. నీరరాజు మాత్యపుత్రుడు. ఈ మహనీయుని వితరణాది గుణము 'లెంత యుత్కృష్టములో కాని, యతనిని నుతించినట్లు తనయేలికలగు విజయనగర పురాధీశులనుగాని మఱి యితర రాజులను గాని సూరకవి పొగడియుండ లేదు. ఇతని పై సూరకవి చెప్పిన వద్య ములు 'పెక్కులుగలవు. వానిలోఁ గొన్నిటినిమాత్ర మే యిచట వాయు చున్నాఁడను.

 క. వర దానాచారంబుల
గరిమగనివనీ వకులును గర్మరులును భూ .
సురమణి' యని నిన్నందురు
విరచితవృష ! పొణ్గుపాటి • వేంకటమంత్రీ.

క. లేడు భువివానం దడయని
వాడున్నీ యింట భుక్తి • వడయనిద్విజుడు