ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

ఆడిదము సూరకవి.


రెయిలు సదుపాయము లేని యాదినములలో సూరకవి వ్యయశ్రయాసములకు వెనుదీయక కాశీయాత్రకుఁ బోయెను, దివ్య క్షేత్రమగు వారాణసీపురమును బవిత్రమగుగంగా స్రవం తినిదర్శించి తనజన్మము సార్థకమైన దానిని గాఁ జేసికొను నాసక్తి యటుండ, సంస్కృత విద్యా ప్రచారమునకు నిలయమై ప్రసిద్ధి గాంచిన కాశీపురమును నవ ద్వీపమును జూచి యాయాస్థలముల యందున్న 'పండితో త్తములను దర్శింప వలయున నెడి యుత్సా హము తన్నుఁ బురిగోల్ప నితఁడు త్తర - దేశయాత గావించెను. కాశీ నుండి స్వదేశమునకుఁ దిరుగవచ్చుచు మార్గములో నున్న దివ్య క్షేత్రమగు శ్రీజగన్నాధమునకు వచ్చియున్నప్పుడే తనకుఁ బరమ మిత్రుడును బోషకుఁడును నగు పొణుపాటి వేంకటమం త్రి స్వర్గస్థుఁ డయ్యెనని విని మిగుల ఖిన్నఁడై యిట్లోక పద్యమును జెప్పి యున్నాడు.

మ. కరుణాసాగర ! పొగ్గా పొటికుల వేం • కటామదాసుస్ వసుం .
ధరయందుంచక' స్వర్గలోకమునకున్ • దగ్గించినావేమి ? త .
తురిఁ గల్పాదులు లేవే యాచనలకున్ ? • భూయాచక శ్రేణి కె .
వ్వరు (దిక్కేమిది) మొండిజగ్గడవు (కా వా వెఱిపల్కితిన్.)

..

ఈ తీరున సంవత్సరమున కై దాఱుమాసములగ ఁ బైగ సూరకవి దేశాటనముచేయుచుఁ గొదువదినము లుచీపురు పల్లెలో నుండుచు, దేశాటనమువలన సంపాదించిన ధనముచే జీవయాత్రగడ పుచు శ్రీరామలింగేశ్వరుని సన్నిధానమున గంథ రచనచేయుచు నుండెడి వాఁడు.