ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱప్రకరణము

61


అని పద్యమును బూర్తిచేసి యాపాపను సంతోష పెట్టి నట్లు వాడుక..

చీపురుపల్లెనుండి స్వగ్రామమగు భూపాలరాజురేగ నెళ్లినపుడెల్ల సూరకవి తన బంధువులగు రెల్లివలస పొణంగిపల్లి వారిని, భోగాపురము దేవగుప్తాపువారిని జూడఁబోయెడివాడు. , ఆకాలమున దేవగుప్తాపు రామయ్య గారు భోగావు మునఁ గణికము చేయుచు వ్యవసాయమువలనఁ దనకుఁ గావలసిన వానిని బండించుకొని హాయిగఁ గాలక్షేపము చేయుచుండెడి వాడు.. అతఁడు బాంధవ్యమున మనకవిగారికీమఱదియైన కారణమునఁ బరియాచకముగ నారామయమంత్రి నిట్లునణిర్ణించి యొక పద్య మునుజెప్పెను.