ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవ ప్రకరణము

దేశాటనము


సూరకవి సంవత్సరమునకు రమారమి "యైదాఱుమాసములు దేశాటనము చేయుచుండెడివాఁడు. ఇతఁడు ప్రతి సంవత్సరము వర్షాశనమునకై - పర్లాకిమిడి, పాలకొండ, బొబ్బిలి, చెముడు, శృంగవరపుకోట మొదలగు స్థలములకుఁ బోవు చుండెను. ఒక సమయమున నతఁడు పర్లాకిమిడికిఁబోయి యాసంస్థానము నఁగల రాజకీయోద్యోగుల సాహాయ్యమున రాజును దర్శింపఁ గోరఁ బండి తాదరము లేనియొక - ముఖ్యోద్యోగస్థుఁడు ' రాజు గారిని దన్నెంపన ఏసమయముకాదని సాకులు సెప్పి కవికినాశా భంగము కలుగఁ జేసెను. తనకుఁగలిగిన యనాదరణము కారణమున నాపట్టణమున నుంచుటకిష్టము లేని వాఁడై సూరకవి సమీప గామమునకు నడవిమార్గమునఁ బోవుచుండెను. ఆకాలమున నక్కడి యడవులలోని తోవలకు « జంతు ”లని పేరు. ఆ 'జంతు'లలో నొకటి యగు " రామజంతి'ని గవియిట్లు వర్ణించి యున్నాడు.

గీ. తరుశిఖర చుం బితామృతాం • ఢస్రవంతి
దళితనక్షత్ర పరి (వృఢ) • తపన కాంత
సమదవేష్టిత సకలభూ • (జానీ తాంతి)
ప్రకట మీంకృతవనదంతి. . "రామజంతి ”.