ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

అడిదము సూరకవి.


తెల్లముగ విప్పి చెప్పి వారిసందజను శాంతచిత్తులుగఁ జేసెనని ప్రబలమగు నొక వాడుకకలదు. శ్రీవత్సవాయి. తిమ్మజగపతి మహారాజులుంగారి రాజ్య కాలము క్రీ| వె|| 1759 మొదలు 1797 వఱకుఁగల కాలమైనందున నీయనకు సమకాలికుఁడు చినవిజయరామ మహారాజనుట స్పష్టము. ఆ కారణము చేత సూరకవి చినవిజయరామ మహా రాజుగారి కాలమున నున్న నాడని చెప్పుట కేమియు నా క్షేపణము లేదు. ..

ఇంతియ 'కాక చినవిజయ రామమహా రాజునకు సమకా లికుఁడై * శృంగవరపుకోట జమీని బరిపాలించు చుండిన శ్రీముఖీ కాశీపతి రాజుగారి రెండవ కుమారుఁడు రాజభూపాల రాజు. తన సత్త్వమును, నెదిరి సత్త్వమును దెలియనివాఁడై మి గులఁ బ్రబలులై యున్న విజయనగర పురాధీశులమీఁదికి దాడి


(1) * " ......... అంతట కాశీపతి రాజు గారి శృంగవరపుకోట మీదికి దండుయెత్తి, మోహింది గే వర్కువారు లొంగుపోటులో రానందున సకల ప్రయత్నాలు చేసి కోట మాత్రం పట్టుకొని రాజ్యం స్వాధీనం తెచ్చుకున్నారు. గన్కు వారు 'కాశీపురం ప్రవేశించి పితూరీ చేస్తూ వచ్చినారు. యీ కాశీపతి రాజు గార్కి ముగ్గురు కొమాళ్ళు. వారి పేర్లు. వీరభద్రరాజు, వీరముకుంద రాజు, రాజభూపాల రాజు, యీ ముగ్గిరి కొమాళ్ళతోటివుండగా యింతలో కాశీపతి రాజు వుండగా నే పెద్దకుమారుడైన వీరభధ్ర రాజు నష్టపోయినాడు. * అంతట .కాశీపతి రాజ్కు బలంతగ్గి శీతారామరాజు గారితోటి బహు దినములు లడాయి చేసి ఆయనయున్నూ గతించినాడు. తరువాత వీరముకుంద రాజూన్నూ