ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ పకరణము.

25



వకు వచ్చుచు త్రోవలో రాజమహేంద్రవరమున నానందగజ పతి రాజుగారు స్ఫోటకముచేత కొలధర్మము నొందిరి. అప్పుడాయన భార్య లిద్దఱును సహగమనముచేసిరఁట. తర్వాత బొబ్బిలిలో మృతులయిన విజయరామరాజు గారి భార్యచంద్రయ్యమ్మ గారు సన్నిహిత జ్ఞాతియైన పూసపాటి రామభద్రరాజుగారి ద్వితీయభార్య పుత్రుడైన పండ్రెండు సంవత్సరముల ప్రాయము గల వేంకటపతిరాజను చిన్న వానిని పెంచుకొని ఆచిన్న వాని పేరు విజయరామరాజుగా మార్చి యాయనను పట్టాభిషిక్తుని జేసెను. ఈ విజయరామరాజు బాలుఁడయి నందున రాజ్యధికార మునంతను సవతియన్న గారగు సీతారామరాజుగారు వహించి, తమ్మునకు యుక్తవయస్సు వచ్చిన తర్వాత సహితమధికారము నంతను తానే చెల్లించుచువచ్చెను. ఈ విజయరామరాజుగారి కాలములోనే మన కవియుండినది. ఆకాలమునందు విజయన గరమువారు నిజాముకు కట్టుపన్ను రెండులక్షల తొంబది వేల యేఁబదితొమ్మిది రూపాయిలు అయినను దేశ మస్వస్థస్థితిలో నున్నందున నిజాము తనకు రావలసిన కప్పమును తిన్నఁగాఁగైకొన శక్తుఁడు గాక 'పెక్కేండ్లూరకుండుచు వచ్చెను. ఈ హేతువు చేతను, సీతారామరాజుగారు బలవంతులయి తమ సేనలతో చిల్లర సంస్థానాధి పతుల' నదిమి కప్పములు గొనుచుంచుట చేతను విజయనగర రాజ్యమాకాలము నందించు మించుగా స్వతంత్ర రాష్ట్రమువలెనే యుండెను. ఈ సీతారామరాజుగారు బొబ్బిలి