ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము

జన్మాదికము—విద్యాభ్యాసము.


 క. చినలచ్చమంత్రి తనయుని -
ననఘుని మజ్జనకు భాస్క రామాత్యమణిన్ .
గోనియా డెదశ్లాభూలం
ఘనజాంఘిక కవనధాటిఁ - గలిగిన మేటిన్.

కవిసంశయ విచ్ఛేదము.)

ఈపద్యమువలన సూరకవి భాస్కరమంత్రి, పుత్రుడనియు, చిన లచ్చమంత్రి పౌత్రుడనియుఁ దేలుచున్నది. ఇతఁడు భూపాలరాజు రేగయను గాయమునక్రీ.శ. 1720 సం. ప్రాంతమున జనన మొందెను. ఈగ్రామము విజయనగరము నకుఁ దూర్పుగా నై దుకోసుల దూరముననున్నది. దీనికి ప్పటి పేరు 'పూసపాటి రేగ. నాటినుండి నేఁటివఱకును నియ్యది అడిదము వారికి నివాసస్థల మైయున్న కారణముచేత - నిప్పుడు గూడ వారిలో, నోకకుటుంబమువారు. "గణికముచేయుచు నిచ్చటనే కాపురముండియున్నారు. చెఱువుమీఁది పద్యములు' చెప్పిన రామకవియు సూరకవితండ్రియగు బాలభాస్కరకవియు నొకే కాలమున స్వగ్రామమగు రేగయందు' నివసించుచుండిరి.వారినాఁడా 'గ్రామమునకు. భూపాల రాజు రేగయని పేరు.