ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి ప్రకరణము

5


క. వాల్మీకివ్యాసులును

గేల్మొగిడిచి నన్న పౌర్యుఁ - గీర్తించిచి కవీం - దుల్మెచ్చఁ గవితఁగూర్చు న కల్మష నిం దిక్కయజ్వ • గణుతించి తగన్ .

క. చినలచ్చ మంత్రి తనయుని ననఘుని మజ్జనకు భాస్క రామాత్యమణిన్ గొనియాడెద శ్లాఘూలంలం ఘనజాంఘిక కవనధాటి • గలిగిన మేటిన్,

క. పుడమిఁగల రసికు లెల్లఁ బొ గడఁగజన రంజనకృతి గావించితి నే నడిదము సూరకవీంద్రుడ మృడశదపంకజ రిరంను • మృదుమాన సుఁడన్ ,

ఈరీతిగఁ గృత్యాదిపద్యములను జెప్పియున్న యతఁడు తన గ్రంథములలో ముఖ్యమగు కవిజనరంజనములో సవతారిక పద్యములను జెప్పియుండ లేదనుటకు నెంతమాత మును వీలు పడదు. 'చెప్పియే ' యుండును. ఎటులనో యవి యంతరించి పోయినవి. పూర్వకవులు కృత్యాది పద్యములను విడిచి పెట్టి కథాభాగమును దొలుతవ్రాయు నాచారము. గలిగియుండెడి వారేమోయని తోఁచెడిని. ఏది యెట్లున్నను: సూచనమాత్రము ప్రారంభముననో 'లేక గంథపరిసమాప్తి యైనతరువాతనో కృత్యాది పద్యములను వాసి యుండవచ్చుననియే నా నమ్ముకము.