ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

అడిదము సూరకవి.


డయ్యెను. ఆంధ్రనామసంగ్రహము వలె.నీశేషముకూడఁ జాలనుపయోగకరమైన నిఘంటువుగాఁ బరిగణింపఁబడి, యాంధ్రులచేఁబరింపఁ బడుచున్నది. ఇట్టి గ్రంథములు ప్రాయికముగఁగవుల కవితాధోరణిని జూపనవకాశ మియ్య నట్టివి. అయినను సూరకవి కవితా ప్రవాహము మాత్రమట్లు మిక్కిలి పరిణామముమెందక దీనియందును, నిరాఘాటముగా వెలయుచు నే యుస్నదనుటకు నీ క్రింది రెండుపద్యములను బొందుపఱచు చున్నాఁడను.


తే, పెంపుఁ జెందెను, దామర • తంపరయ్యేం
బబలె, సెగ డెను,గొనసాగే • బలి సెఁ బెరిఁ?
ననఁగఁరేకేత్తె ననఁగఁచే ళ్ళయ్యేవృద్ధి
బొందెననుటకు శేషాహి " భూషి తాంగ.

తే, అగపడకపోయె,విచ్చు మొగ్గయ్యె, ననఁగఁ
గంటఁ బడఁడయ్యె: బంచబం • గాళమయ్యె
ననఁగ దృగగోచరంబయ్యె • ననుట పేళ్ళు
శయఘటితశూల ! నైయామ • చర్మ చేల !

రానులిం గేశ శతకము:-

సూరకవి గ్రంథములలో నెల్లమిగుల జనరంజకమైనదియు, నతనికాలమున నే పలువురచే నాదరింపఁబడినదియు నగు నీశతకము క్రీస్తుశకము 1770-1785 సం వత్సరముల మధ్య కాలమున రచింపఁబడినదని యూహించుట కుదగిన యాధారములున్నవి. శ్రీవిజయనగర - ప్రభువులును కవికి నాశ్రయులునునగు శ్రీచినవిజయ రామరామ గజపతి మహారాజు