ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదయవ ప్రకరణము

129


గూల లీలఁ దత్సేన్య ముద్ధూత చైతన్యము వేసి యు ద్వేలకోలాహలాభీల హే లాసము ? సిమై యస్ ని ఎండు చెండాడి తైయకు వీజే శుశు క్షుణ్య పేక్షు కృ దుగా ఆ వాలాగ బద్ధాంశుక ప్రస్ఫుర ద్విస్ఫులింగచ్ఛటాభీలకీలా, కరాణాగ్ని లంకాపు రా గారము ల్భస్మ సా త్కారము ల్పేసి వేళంతమున్బోలె తానాసరస్వత తము నాటి నిన్గాంచి లం కాపురో ద్యాన మధ్య స్థితాం దానవీ సంవృతాం ల్వేద్వి యోగ వ్యధా క్లిష్ట గాతీం విదేహేందపుతీ మపశ్యం" రఘూత్తంస యంచు న్సుధామాధురీశ్రీ ధురీలో కుల న్విన్న వింపంగ .....


5. ఆంధ్రనామ శేషము: ఇది పద్యరూపమున నున్న యొక నిమంటువు. పైడిపాటి లక్ష్ముణకవి కృతమగు నాంధ్రనామ సంగ్హాహమునందు లేని పదములను జేర్చి. యోనిఘంటువును సూరకవి రచియించినాఁడు. ఆవిషయమునే 'యతడీ గ్రంధా రం భమున నిట్లు చెప్పి యున్నాఁడు.


గీ. ఆంధ్ర నామసంగ్ర హమునందు. జెప్పని
యన్ని తెనుఁగు మఱుఁగు లరసికూర్చి
యాంధ్ర నామ శేష మను పేరఁ జెప్పెద :
దీనిఁ జిత్తగింపు దేవ దేవ


ఆంధ్రపదజాలము నొకచోట, నేర్చి కూర్చి వివిధ వర్గులు గా విభాగించి గ్రంథముగాఁ జేయుటయేమిగులఁ గష్టమగుఫని. అట్టి ఘన కార్య మొక రొనర్చిన పిదప దానియందలి విశిష్ట భాగ ములఁ బూరించుట మఱియుఁ గష్టము. ఈ కార్యమును సూర కవి కడు శ్లాఘనీయముగ జేసి యాంధ్రుల కృతజ్ఞతకు బాత్రు 17