ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

అడిదము సూరకవి.


గ్రంథములను రచించి , నలుగురౌనన - "బేరుబ్రతిష్ఠలఁ గాంచియీకవి మించెను. ఈతని కవిత్వమున నఱువది పాళ్ళు సంస్కృతమును నలువది పాళ్ళు తెనుఁగునుగలదు.


రాజా మంత్రిప్రగడ భుజంగ రావు బహద్దరు గారు-

(చంద్రాలోకమునకు ను పోద్ఘాతము.)

6. ఈతఁడనేక గ్రంథంబులు రచియించె. అందు జంద్రమతీపరిణయము లేక కవిజనరంజనమను నది ప్రబంధము. ఇదిప్రబంధమనఁదగి దాని రచియించిన కవి పేరు శాశ్వతమైభూమి యందుండు 'నల్గొన ర్చె. ”

గురజాడ శ్రీరామమూర్తివంతులుగారు-(కవిజీవితములు.)

".. - వసుచరిత్రములోని కల్పనములను గడపట్టులను ననుసరించి చెప్పిన వారిలో ముఖ్యుల గ్రంథములు పిల్ల వసుచరిత్రములని ప్రసిద్ధిని జెంది యున్నవి.అడిదము సూరకవి ప్రణీతమగు కవిజనరంజనములోనివర్ణణనములును సరసముగనే యున్నవి. కాని యిందుఁగథా భాగమేమియుఁ గానరాదు.


వజ్జల చినసీతారామస్వామి శాస్త్రి గారు - (వసుచరిత విమర్శనము .)