ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము.

79



ఈ రీతిగఁ బద్యములు వాసి. వాసిన 'తాటాకులను నీటి లో విడువ నట్టిదూషణను సహించి యచటనిలిచి యుండుట యుక్తముకాదని తెలుపుటకో యనఁ జెఱువులోని నీరు గండి తెగిపాఱిసముద్యగామియయ్యె . కవిఁ గలిగిన బాధ యంతటితోఁదొలఁగెను. రామన కృతకృత్యుఁడై పొలమునుండి యింటి కేఁగెను.


ఈపద్యముల రచనతో సంబంధించి పారంపర్యముగ నొకవింత చెప్పఁబడుచుచున్నది. మీఁద వాయఁబడిన యర్జీ- పద్యములలో మొదటి దానియెత్తు గీతమునందు(మాపు ట్టిముంపఁ దలఁచి "యని ప్రయోగించుటచేతఁ గవికిఁ గళతన స్టమైనదఁట. "వరిపుట్టి ముంపఁదలఁచి ” అని చెప్పనుద్దేశించి నను దైవికముగ నూపుట్టి ముంపఁదలఁచి యని ప్రయోగింప బడెనఁట. ఈ గాథ యొక్క సత్యాసత్యములు చర్చింపనవకాశమే మియు "లేదు. కుటుంబములోఁ దరముల వెంబడివచ్చుచున్న యంశమగుట చే నిందుఁ బొందుపఱుప సాహసించితిని.

పద్యముల కతృత్వమును గూర్చి చర్చ.

1. సూరకని తనతండ్రియగు బాలభాస్కరకవి మరణా నంతరము స్వగ్రామమగు భూపాల రాజు రేగ విడిచి చీపురుపల్లెకు సమీపమున నున్న రామచందపురమును దనకు నివాస స్థలముగనేర్పఱచుకొనెనని మూఁడవ ప్రకరణమున వాసి యుంటిని.ఇంతీయ గాక. .