ఈ పుట ఆమోదించబడ్డది
2017 మార్చితో ముగిసిన సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఆడిట్ నివేదిక
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వివిధ అంశాలలో క్రమమైన హెచ్చు/తగ్గులను గమనించడమైంది. వాటిని ఈ దిగువ పేర్కొనడమైంది:
రెవెన్యూ రాబడులు
- 11.66 శాతం మేరకు పెరిగాయి
- సొంత పన్ను రాబడి 10.71 శాతం మేరకు పెరిగాయి
- భారత ప్రభుత్వం నుండి గ్రాంటులు 6.47 శాతం మేరకు పెరిగాయి
రెవెన్యూ ఖర్చు
- 21.12 శాతం మేరకు పెరిగింది
- ప్రణాళికా వ్యయం 13.90 శాతం మేరకు పెరిగింది
- ప్రణాళికేతర వ్యయం 24.71 శాతం మేరకు పెరిగింది
క్యాపిటల్ పరిచ్యయం
- 6.86 శాతం మేరకు పెరిగింది.
లోన్లు, అడ్వాన్సులు
- రికవరీలు 611.93 శాతం మేరకు పెరిగాయి
- చెల్లింపులు 16.32 శాతం మేరకు తగ్గాయి.
ప్రజా రుణం
- రాబడులు 11.63 శాతం మేరకు పెరిగాయి
- రీపేమెంటులు 9.54 శాతం మేరకు తగ్గాయి
నగదు నిల్వ
- 21,48 శాతం మేరకు పెరిగింది
2016-17 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ లోటు 17,231[1] కోట్లు. ఈ ఏడాది ద్రవ్య లోటు (30,908 కోట్లు) జీఎస్డీపీలో 4.42 శాతం ఉంది. ఇది 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితి 3.25 శాతం కన్నా ఎక్కువగా ఉంది.
- ↑ ఉజ్వల్ డిస్కమ్స్ యోజన (యూడీఏవై) పథకం కింది 18,256 కోట్లను కలుపుకొని
పేజీ 2