తోనే గాక క్లిష్ట ప్రాసతోను నడిపించిల్రి. భీముని క్రోధాతిరేకము నోకచో తిక్కనగారు - "నేలయు నింగియు దేఅశముల్ గా జేసి, యేపునరేగి వాయించియాత" అని సీవనమును సమాస రహితముగను చిత్రించి యందు జీవకళ పొదిగిరి. దాసుగారును తాదృశానేక సందర్భములందు సీసమునకు వన్నె దెచ్చిరి.
చూ. 1.నరసింహావిర్భావము (15):-
సీ॥ గంభీర భీకర గర్జారవంబున
బ్రహ్మాండ భాండ కర్పరము పగుల
2.నక్రవిక్రమము (పరిశిష్టము-పుట 2):-
సీ॥ భూరి భూత్కార సంధూత గంభీర గుం
భద్వానమున శైలపంక్తి నడక...
అయితే యిందు సమాసములును, శబ్ధాలంకారములును గలవు. అట్లు లేకుండగను ఆ సందర్భములకు సీసము నియోగించ వచ్చునని నిరూపించిరి.
చూ.1.భీష్మ ప్రతిజ్ఞ (పరిశిష్టము-పుట 8)"-
సీ॥రాలనీ చుక్కలు, కూలనీ కులగిరు,
లిల గ్రుంకనీ, వార్ధు లింకిపోని
ఆకస్మికముగ సూర్యారంద్రముల్ గతుల్
దప్పనీ, జగమెల్ల తల్లడిలని...
2.భీష్మ సంగ్రామము (పరిశిష్తము-పుట 7):-
సీ॥ విరిగెడు నరదము లొరిగెడు గుఱ్ఱముల్,
తెగిపడు సిడములు, త్రెళ్లు కరులు...
ఇట చందమునకును శైలికిని గల మధుర భాంధవమును దర్శించగలము. ఫలాని సందర్భమునకు ఫలాని చంద మను నియమము సామాన్యకవులకు, విదగ్ధ లే సందర్భమున ఏ చందం నెత్తుకొన్నను తమ శైలీ ప్రాగల్బ్యముతొ దానికి మొలాము వేయుదురు.
"ముందటి దినములలోపల । కందమునకు సోమయాజి ఘను డందురు". శ్రీనాధుని సీస మందురు. నన్నయ మత్తేభ మందురు. వేమన ఆటవలది యందురు. ఆదిభట్ల వారి వేమనవలెనో నాకు బోధపడలేదు.