ఇరుగడ మేరుశిఖర మినచంద్రుల
వలె దల కుండలంబులు వెలుంగ
క్రొమ్మెఱుంగులతోడి క్రొక్కారు మబ్బట్లు
తారహారముల నెద విలిసిల్ల
................
'ఘంటా మాము 'ని కైవాడమును దలపించుచున్న నీ యవనులు.
3.రెప్లెక్టరుంబోలె రెట్టి జేయును నైజ
మగు తెల్వి దీపంబువంటి విద్య (42)
'దీప శిఖా కాళిదాసు ' రూపునకు దీటుగా నున్నదీ సంక్తి.
4. వల్లంబువంఖ: బ్రవర్తించె నీ ర్విశే
ష్యం జాడ జను విశేషణము భంగి...
ఇత్యాదిగా సాగిన ప్రానృద్వర్ధనమున వ్యాకరణశాస్త్ర మర్యాదా సంవాదియైన యనమ దాసుగారి శాస్త్రరాసిక్యమునకు గుర్తు (పుట.53)
5.పానగోష్టి నెమ్మివలె గొన్ని కాల్వలు
వాన కురియ నంతవఱకు దోచి
వంకశేషము లయి యింకెడున్; మఱికొన్ని
మన్నునపుడు సుజనమైత్రి బోలు.
దాసుగారి దెంత లోకజ్ఞత! వట్టి లోకజ్ఞతయేనా! ఏమైన అనుభవముగూడ నున్నదా? యన్నచో పెన్నెల అప్పుడప్పుడు భంగును, బ్రాందీని సేవించినట్లు వారే స్వీయచరిత్రలో వ్రాసుకొనిరి. వానికి చిన్నగురువులే, మరి వేర విద్యాగురువులు లేరు. ఆ ఉపమేయోపమముల అనుబంధ మర్ధనరీశ్వరము.
6. పుట 55-58లో అలకనారాయణ గజపతి ప్రభువు టెన్నిసుక్రీడను, పప్పు వెంకన్నగారి పాటను వర్ణించు పట్టునను, 30వ పుటలో శోకహత లోకము గురించి యున్న పద్యములందును అనుపదమున కవి పొదిగిన యవనులను పరికించితిమేని అపర్జ్యవిషయముల అంతరస్నాయవుల యెడను వారు సారించు సునిశిత పరిశీలన క్షమమైన చూపును గుర్తింపగలము.