68 కవికోకిల గ్రంథావళి [షష్ఠాంకము
[మాండవ్యుఁడు, సానందుఁడు ప్రవేశింతురు.]
సానం : అమ్మా.
సీత : నాయనా, యేమి?
సానం : మీ కుశలవులను గట్టుదిట్టము సేయకున్నఁ బ్రాణాపాయము గలుగును.
సీత : సానందా, యేల యిట్లు పలుకుచున్నావు? వా రేమిచేసిరి?
సానం : కొదమను లాగివైచి తల్లిసింగమును పాలు పితుకుచుండిరి. మేము అది యేమిపనియన్న మాపైకి సింహకిశోరమును విసరి భయ పెట్టిరి. నే నబద్ధమాడిన ఈ మాండవ్యుని అడుగుము.
మాండ : ఇందేమి యబద్ధమున్నది.
సీత : అయ్యో! వారికిఁ గ్రూరమృగములతో నేమి చర్లాటము ? వాల్మీకినాయనగారితోఁజెప్పి కుశలవులకుఁ దగు శిక్షచేయించెదను. మీరుపొండు.
మాండ : అమ్మా, అడవిమృగములన్న లవునకుఁ గొంచెముగూడ భయములేదు. మాబోఁటివాండ్లమే భయపడుచుందుము.
[నేపథ్యమున]
అన్నా, నావిల్లుగూడ కొమ్మకుఁ దగిలించుము.
సానం : అమ్మా, మే మిఁకవెళ్ళెదము; లవుని కంఠస్వనమువలె నున్నది. మమ్ముఁజూఁచిన సింగపుకూనను ఉసిగొల్పుదురు.
[నిష్క్రమింతురు]
సీత : కురంగములతోడఁ బంచానన కిశోరములఁ బెంచినను వాని స్వభావ మేల మానును?