54 కవికోకిల గ్రంథావళి [చతుర్థాంకము
ద్వితీయ స్థలము : అడవి
[వాల్మీకి, మాండవ్యుఁడు మాటలాడుచుండఁగా తెఱ యెత్తఁబడును.]
వాల్మీ : మాండవ్యా, నీవు చూచితిననిచెప్పిన సాధ్వి యెచ్చట నున్నది?
మాండ : ఇచ్చోటనే మూర్ఛిల్లి పడి యుండినది. ఇపు డెచ్చటికో పోయియుండును.
వాల్మీ : ఈవనమం దెయ్యెడనో వృక్షచ్ఛాయల విశ్రమించియుండునేమొ చూతము రమ్ము.
[నిష్క్రమింతురు.]
[తెఱయెత్తఁగా సీత తరుమూలమునఁ గూర్చుండియుండును.]
సీత : చిత్తమా, యూరక యేల యంతరాళసౌధములు నిర్మించెదవు? మున్ను లంకలో నశోకవనమున నివసించు చున్నప్పుడు నామనోనాయకుఁడు దానవ పతిని వధియించి నన్ను మరలఁ గొంపోవునను పేరాసతో మేన నసువులు భరియించితిగాని, యట్టి యాశావలంబము నేఁడు లేదుగదా.
[వాల్మీకి, మాండవ్యుఁడు ప్రవేశింతురు]
వాల్మీ : [స్వగతము] ఈకుమారియా! [ముక్కుపై వ్రేలిడికొని] ఆహా! అంతయుఁ దెలిసె. [ప్రకాశముగ] రామపత్నీ.
సీత : [ఉల్కిపడి లేచి - స్వగతము] ఎవరో మునీశ్వరులు! నన్నెటు గుర్తించిరి? [ప్రకాశముగ] మహాత్ములారా, వందనములు.
వాల్మీ : దీర్ఘ సుమంగలీ భవ!