108 కవికోకిల గ్రంథావళి [అష్టమాంకము
[వాల్మీకి కుశలవులు ప్రవేశింతురు]
వాల్మీ : రామభద్రా, మంగళ మగుఁగాక !
రాము : మునీంద్రా, భవదాగమమునఁ గృతార్థుఁడ నైతిని.
మునులు : తథాస్తు. తథాస్తు.
రాము : [స్వగతము] లక్ష్మణుఁ డెఱిగించిన సౌందర్యమూర్తు లీ యిరువురు వటువులై యుందురా ?
[సభలో గుజగుజలు]
రాము : మునీంద్రా, యీ తాపస వటువు లెవ్వరి కుమారులు ?
వాల్మీ : వీరొక వనవాసిని బిడ్డలు.
లవు : [జనాంతికము] అన్నా, యీ యజమానుఁడేనా రామాయణ కథానాయకుఁడు ?
కుశు : అట్లే తోఁచుచున్నాఁడు. తమ్ముఁడా, యీ శాంతస్వరూపుని దర్శించినంతఁ దల్లినిగాంచినంత యనురాగ ముప్పతిల్లుచున్నది !
లవు : అన్నా, వాల్మీకితాత సత్యమే వర్ణించును.
రాము : మునీంద్రా, ఆ వనవాసిని యెవ్వతె ?
వాల్మీ : ఎవ్వతెయో యొకగర్భిణి వనముల నిస్సహాయయై పరితపించుచుండ, నే నాశ్రమమునకుఁ దీసికొనిపోయి కుమారీ నిర్విశేషముగఁ బోషించుచుంటిని.
రాము : తాపసోత్తమా, యీనిర్హేతుకవాత్సల్యము మీ దివ్యచిత్తమున కనురూపమైనది - తరువాత ?
వాల్మీ : కొన్నిదినముల కా సీమంతిని యీకవ బిడ్డలను బ్రసవించెను.
రాము : [స్వగతము] ఆహా! యీ సుందరకుమారులఁ గాంచిన