ఈ పుట అచ్చుదిద్దబడ్డది
118
కవి గ్రంథరచనకాలము సమకాలికులను జీవితమునుగూర్చి ప్రత్యేకించి వ్రాయనున్నారము గావున నిందు విరమించితిమి.
ఈశతకమునందలి భావములు సరళముగ హృదయంగమముగ నున్నవి. ధారయు నిరర్గళముగ నున్నది. ఇట్టి యుత్తమశతకము కవివంశీయులగు విజయరామశాస్త్రులవారు తాళపత్రగ్రంథములనుండి చిరకాలము క్రిందట నెత్తివ్రాసిరి. అందుఁ గొన్నిస్ఖాలిత్యము లుంటచేఁ గవ్యభిప్రాయానుగుణముగ సవరించి శుద్ధప్రతి నేర్పఱచితిమి.
ఈకవికృత గ్రంథములన్నియు ముద్రణమునకు నొసంగి శుద్ధప్రతి పీఠికవ్రాయుటకు మాకవకాశము కల్పించిన కవి వంశీయులగు దిట్టకవి సుందరరామయ్యశర్మ పాకయాజిగారును, శతకసంపుటములలో నీయమూల్యగ్రంథములఁ జేర్చిన శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రిగారును ఆంధ్రులకృతజ్ఞతకుఁ బాత్రులు.
నందిగామ
ఇట్లు భాషాసేవకులు
20-4-25
శేషాద్రిరమణకవులు, శతావధానులు