ద్వితీయాంకము
27
అం:- (తనలో) యీ ముదుకండేడియో కైలాటమం దెచ్చి పెట్టు
టకు యత్నించుచున్నాడు.శాంతముతో వినియెదను.
వ:--- చైనులుగారూ ! మీరు కొంతతడ వూరకుండు'డు. (మ నికి ,
గన్సన్న జేయును)
శ్రీ: హనుమం తా ! అంగదుఁ డలసినయంట్లునది. యువ రాజును
విడిదలకుఁ గొంపోయి సత్కారములను గాపింపుము.
హ:- అంగదా ! మనము విడిదలకుఁబోదమురమ్ము. (ఇరువురును
బయలు దేరుదురు)
అం:-(తనలో) ప్రజ్ఞకు లోపమా !వైదికమునందు గాక లౌకికము
నందు గూడ వసిష్ఠువారసాధారణులే. మే మేమియో వినిపోదు
మని చెప్పి యీమిషచే మమ్మావలకంపింపుచున్నాడు. అయినను
జిత్రము చూచితీర వలయును. (హనుమంతునికై తిరిగి) యాంజ
నేయా ! యిది నీవు రామాయణము నిర్మించుట యందుఁ బడ్డ
శ్రమకుఁ బ్రతిఫలము గా బోలు.
హ: అంగదా ! యింకను నీకుఁ చిన్న తనము వదలలేదు గా ! ఆర్య
లను దిరస్కరింపగూడదు.
అ:- ద్రావిడులను దిరస్కరింపవచ్చునా ?
హ:- కొంటెయాటలను మాని యిటువినుము.
మనము సామాన్య సేవకులము, రాజులు రాచ కార్యములను
బహిరంగముగా అర్చింపనొల్లరు.
అం: అవును మనము సామాన్య సేనకుల మే.
అందు ముఖ్యముగా నీవు కిష్కింధాపురము వదలి
నప్పటినుండి సామాన్య సేవకుడవే