ప్రథమాంక ము
15
లేదు. ఈశరీరంబునకు మరణంబు నైసర్గిక ధర్మంబు. ఇదివఱికే
నిరంతరతపఁబుచే, శుష్కించి, శుష్కించి, శల్యావశిష్టంబుగ
నున్నది. ఈ యెముకలప్రోవుపై శ్రీరాముఁడు విశ్వామిత్ర దత్త
మైన ధనుష్పాండిత్యము మెఱయ నస్రప్రయోగముఁ గావించి
కీర్తి ని బొందినఁ బొందు గాక, శిష్యుని లక్ష్యజ్ఞానమునకు విశ్వా
మిత్రుడు సంతసించిన, సంతసించుఁ గాక, కుమారా ! యింకొ
క్కటి విచారింపుము.
సీ. ఇల్వల వాతాపు • లిద్దరు పల్వుర
మనుజుల దిగమ్రింగి • రనుటయేల !
కుంభకర్ణాదులు, గుటగుట రక్తంబుఁ
దెగ ద్రావిరని చెప్పి • తెగడు టేల ?
చేతికందినయట్టి' జీవరాసుల కబం
ధుఁడు చంపె నంచును, నుడువు టేల?
మత్తిల్లి తారక • మనుజాళి పల్వుర
భక్షించెనని చెప్పి, • బదరు టేల?
సూర్యవంశోద్భవుం డతి శూరవరుఁడు
వివర మెఱిగిన మనుజుండు. బికిర మెత్తి
కొనుచు జీవించునొక కృశాంగునిన లౌకి
కుని నిరపరాధు దయమాలి. గొంతుగోయ ..........10
అం:-- అమంగళము ప్రతిహతమగుఁగాక.
శం: ఇందమంగళ మేమున్నది! జరుగవలసిన కార్యవిధానమే యిది.
అం:-అయ్యా ! యీవృధామరణమువలన లాభ మేమున్నది ?
శం:-ఏమున్నదా ! శ్రీరాముఁడు ఖడ్గహస్తుఁడై చనుదెంచి, నన్నీ
జపతపంబులుమాని ద్విజ సేవచేయుమన్నను నాయంతరాత్మకు వ్య