12
శంబుకవధ
అం:- ఏమందురని మా యు ద్దేశ్యము ?
శం:-- ఇందు ద్దేశ్యమేల ! నిశ్చయమే. ఏకగ్రీవముగా నీశ్వరుని
దృష్టియందుఁ దుల్యులని నిశ్శంకముగాఁ జెప్పెదరు.
అం: అటులయినచో నీ స్మృతులన్నియు నిట్టు లేల చెప్పిరి ! కారణ
'మేమి చెప్పెదరు ? దీన ఋషులకు లాభమేమి ?
శం:- ఇదియే మనము శ్రద్ధగా విచారింపవలసినది. చెప్పెదవినుము.
ఇవి సంఘనిర్మాణమునకు దీర్ఘ దృష్టి తోడను, నై పుణ్యముతోడను
నేర్పఱచిన కట్టుదిట్టములు. ఈ శిక్షాస్మృతులే లేకున్న సంఘము
చీకాకువడి నిర్వీర్యమును ! దుర్బలమును నగునని నమ్మి వీని
బుట్టించిరి.
అం:-స్మృతులు: మతసంబంధములగు గ్రంథము లేకావా ?
శం: ముమ్మాటికిని గావు. సాంఘిక చరిత్రమునకు సంబంధించినవి,
ఇట్లు వివరింపకయే రెంటిని గలకలపి మనలను: మత స్వాతంత్ర్య
దూరగులఁ జేసి మహాపాతకమును మూటఁగట్టుకొను చున్నారు.
భగవంతుఁ డిట్టివాడని యివి బోధించు చున్నవా ?
అం:- అటులయినచో స్మృతు లనవసర గ్రంథములనియా మీ యభి
ప్రాయము?
శం: కుమారా అట్లు కాదు వినుము . పరాజితుల దమ సంఘమున
నానూపర్చుకొనునప్పుడు జేతలు జాగరూకులై యుండుట ధర్మము.
అం: ఋష్యతంత్ర్యమును; స్వత్వమును నొసంగిన బాలితులకుఁ
............ లోపములును, బలాబలములును దెలియును.
శం: .... ..............ఉచ్చదశకు దప్పక భంగము వాటిల్లును.
..........................బాలకుల యాయువు పట్టు జూపించుట