పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/165

ఈ పుట ఆమోదించబడ్డది

164

రంగారాయ చరిత్రము


తే.

 అనుచుఁ బరివేదన మొనర్చి రమ్మహీశు
హితపురోహితబాంధవప్రతతులెల్లఁ
దిట్టితే గుద్దినట్లును గట్టికుడుపె
నితనిదుష్కృత మని పల్కి రితరజనులు.

263


ఉ.

 ఆతదనంతరంబున మహాకులతన్ శిబిరంబులో జన
వ్రాత మొనర్చు క్రందలివిరావముచే నిదమిత్థ మన్న వా
ర్తాతతిశూన్యమై కలవరంపుఁదనంబున నెట్లొ కాకయన్
భీతిపరాసు ఱేడు కొలిపించె నగాదు ఫిరంగు లాపయిన్.

264


తే.

 ఆఫిరంగులరవళికి నానృపాలు
శిబిర మెల్ల చికా కయి చెదరఁ దొణఁగె
నపు డరాజక మైన తదావసథముఁ
గొల్లపఱచిరి కొల్లరు ల్గొల్లగాండ్రు.

265


వ.

 అంతట.

266


తే.

 రావువారిసంబంధి యుగ్రముగ వచ్చి
నృపునిఁ జంపుట నుభయసైనికులు వినిరి
రాజుచావుకు నంత ఫరాసుబలము
సంతసం బందె హైదరుజంగు తక్క.

267


మ.

 చని యారాజకళేబరంబు గని తచ్ఛారీరసంబంధు లం
తనితాంతార్తిని రోదన ల్సలుపుచు న్నానావిధానూనత
ద్ఘననైకాద్భుతకృత్యసంపదలచందంబు ల్వితర్కించుచుం
దనరం దన్మరణాతిచిత్రమహిమ ల్తర్కించి వాక్రుచ్చుచున్.

268


వ.

 అంత.

269


సీ.

 సంపూర్ణరుచి మించు చంద్రబింబములేక
         పరఁగెడు నక్షత్రపంక్తిమాడ్కి