పుట:2015.373254.Bhanukavi-Panchatantri 0056.pdf/2

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

కుశలంబె యని పల్కఁ గొల్చి మనెడు ప్రజ
                    కును దలంపంగ నేటి కుశల మాత్మ
సంపదలను మానసంబు ప్రాణంబులు
                    నధిపతి సొమ్ము లటంచుఁ బలికి
ద్రవ్యంబు గలిగి గర్వము లేనివాఁడును,
                    భామామణులవలం బడనివాఁడు,
నుర్వీశులకుఁ బ్రియం బొనరించువాఁడును,
                    బంధురామయములఁ బడనివాఁడు


గీ.

నర్థియై గౌరవంబున నలరువాఁడు,
కపటచిత్తుని మాయలఁ గడచువాఁడు,
శమనపుటభేదనముఁ జేరఁ జననివాఁడు,
మనుజుఁ డెవ్వాఁడు గలడు భూమండలమున!

200


మ.

అన సంజీవకుఁ డిట్టిపల్కులకుఁ గార్యం బంతయున్ జెప్పు మ
న్నను, వాఁ డిట్లని చెప్పి రాజుకుఁ బ్రమాణం బెద్ది నీమాంసమున్
దను సేవించినవారికెల్ల నిడ నాత్మం గోరియున్నాడు, ము
న్ననఘా! మైత్రి ఘటించినాఁడవని నీ కాద్యంతమున్ జెప్పితిన్.

201


వ.

అని పలికిన నిని యత్యంతవిషాదమ్మునఁ గుందుచుఁ సంజీవ
కుండు దమనకుం గనుంగొని యిట్లనియె.

202


మ.

అపరాధ మ్మొకయింత లేని నను నన్యాయమ్మునన్ రాజు క
ష్టపువృత్తిన్ జెఱుపంగఁ జూవె కడునాశ్చర్యమ్ము! సర్వంసహా
ధిఫులం దెక్కడి నీతి! చూడఁగ మదాంధీభూతచేతస్కులై
యువకారం బొనరించువానిఁ బరుగా నూహింతు రుర్వీస్థలిన్.

203


క.

కారణము లేక యల్గును
వారణ మశకముల నొక్కపడువునఁ జూచున్
ధారుణిపతిఁ గొచ్చుట మది
నారయ నల్పంబు విఠ్ఠలాత్మజ లక్ష్మా!

204


సీ.

అరయ జాత్యంధున కద్దమ్ముఁ జూపుచం
                    దమున నరణ్యరోదనము మాడ్కి