పుట:2015.373254.Bhanukavi-Panchatantri 0056.pdf/1

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

మానవనాయక! శోణిత
పాన మనోరథముచేతఁ బఱతేవలసెన్
నే నని చెప్పిన నందుకుఁ
దా నిట్లనియెం బ్రియమ్ము దళు కొత్తంగన్.

195


వ.

డిండిభా! నీవు తీక్ష్ణదశనుండవు కాలం బెఱుంగవు యెట్టివాని
నైన మిట్టిపడం బొడిచెద వనిన నల్లిఱేఁడు నట్లైన మన్నిలయంబున కరుగు
దునే! యన చీరపేను దాక్షిణ్యమ్మున మహీపతి సుప్తుండైన రక్తపానంబు
సేయుమని ముదల యిచ్చిన నల్లియు నల్లుకొన్న సంతోషాతిశయంబున
నియ్యకొని, యెప్పుడు ప్రొద్దు గ్రుంకునని యెదురుచూడ నంత నిశాసమ
యంబగుడు రాజు భోజనం భారగించి శయ్యాతలంబునఁ జేరి నిద్రించు
చుండ మెల్లన మత్కుణం బతనిక్రిందకిం జని యారాజుం గఱచిన నతం
డదరిపడి లేచి.

196


క.

భూపతి ప్రతిహారులఁ గని
దీపము దెమ్మనిన వారు దెచ్చిన యంతన్
వే, పారిపోయి మత్కుణ
మాపర్యంకమ్ముక్రింద నణఁగె భయమునన్.

197


గీ.

మంచతల మెల్లఁ జూడఁ దన్మధ్యమందు
వస్త్రయూక చరించంగ వారు సూచి
యద్భుతం బంది యచ్చటి కరుగుదెంచె
ననుచుఁ జంపిరి దాని ననంతరంబ.

198


వ.

అట్లు గావున వివేకహీనునకుఁ దన శ్రీ యొసంగిన వస్త్రయూక
చెడిపోయినచందమ్మునఁ జచ్చునని చెప్పిన విని మృగేంద్రుం డంగీకరించి
యిట్లనియె మృగధూర్త! గోపతి యుద్ధసన్నద్ధుండగుట, యేక్రమంబున
నెఱుంగ వచ్చుననిన నతం డిట్లనియె, నాయనడ్వాహమ్ము తనశృంగాగ్ర
మ్ములు వంచుకొని యభిముఖుండై చకితుండునుంబోలె పాదాంతికమ్ము
చేరునప్పుడు తెలియుమని చెప్పి యచ్చోటు వాసి సంజీవకు కడకుం జనిన
వాఁడు దమనకుం జూచి యిట్లనియె.

199