ఆత్మ చరిత్రము 230
పరిశీలనాశక్తియును, అనుతాపతీవ్రతయును, అపరాధములు చేయకుండు నా బుద్ధినేల యరికట్టనేరకుండెనని యచ్చెరువొందు చుందును. నాకుఁ గల యమిత మతాభినివేశము, అపార దైవభక్తియును, మనస్సును అన్యాయపథమునుండి యేల మరలింపఁజాల కుండెనో గ్రాహ్యము గాకుండెను !
జూన్ 8 వ తేదీని నేనును, మృత్యుంజయరావును, రెయిలు స్టేషనుకుఁ బోయి బెజవాడలో జరిగెడి కేష్ణామండలసభ కేగుచుండు వెంకటరత్నము నాయఁడుగారిని సందర్శించితిమి. బెజవాడ వీడవలదనియు, ఎమ్. ఏ. పరీక్షకుఁ జదువుమనియు నాయుఁడుగారు నాకు సలహా నిచ్చిరి. వారు రాజమంద్రి వచ్చి జూన్ 15, 16 తేదీలలో నచట నుండిరి. 16 వ తేదీని మేము చేయించిన బహిరంగసభలో, "సువిశాల మిదం విశ్వం" అను శీర్షికతో నాయఁడుగా రొక యాంగ్లోపన్యాస మిచ్చిరి.
తలిదండ్రులయొద్దను బంధుమిత్రులయొద్దను సెలవుఁగైకొని, 20 వ జూనున బెజవాడకు ప్రయాణమై, మధ్యాహ్నమున కచటఁ జేరి, నా వస్తువులు, పుస్తకములును, సరదికొంటిని. ఉపాధ్యాయ మిత్రుఁడగు దేవసహాయముగారితోఁ గలసి మాటాడునప్పుడు, ఈపాఠశాలలోనే నేను రాఁబోవు సంవత్సరమునఁ గూడ నుండి, ఆయన ఖాళీచేయఁబోవు ద్వితీయోపాధ్యాయపదవి నలంకరింపఁగల ననెడి యాశను నా కాయన గలుగఁజేసిరి.
5. మరల బెజవాడ.
బెజవాడ పాఠశాలలో పని జూన్ 21 వ తేదీని మరల ప్రారంభ మయ్యెను. మఱునాఁడు ఉపాధ్యాయులసభ జరిగెను. అందు