ఈ పుట ఆమోదించబడ్డది
లసినంత విశాలమగు ఖాళీస్థలము కలదు. భారతప్రభుత్వము, రామ్సేగారు కూడ, బెంగుళూరునే వరించిరి. *
ఈస్థితిలో వదాన్యుడు ప్రజాక్షేమాభిలాషియునగు మైసూరు మహారాజుగారు (అప్పటి తమదివానగు శేషాద్రి అయ్యరుగారి ప్రోత్సాహమున), బెంగుళూరులో దానినుంచుచో, అచట (300 ఎకరములకు తక్కువలేకుండ) అందుకు వలయు స్థలమంతయు, భవనయంత్రాదులకై 5 లక్షల రూపాయలను, ఇంకను సాలినా యేబదివేల రూప్యములను, ఎట్టిషరతులు లేకుండ నుచితముగ నిచ్చెదమనిరి. మరొక ప్రాంతమున దాని నుంచుచో, ఇట్టివిరాళము దొరకునట్లు కనబడలేదు; (మైసూరు సంస్థానమందు స్థాపింపదలచు వివిధపరిశ్రమల కావిజ్ఞానాలయము సహకారియగునని, తమ సంస్థానవిద్యార్ధులకును లాభకరమని, మైసూరుప్రభుత్వమువారు గ్రహించిరి). అంతట బెంగుళూరిలోనే యావిజ్ఞానాలయము నుంచుట స్థిరమయ్యెను.
కాని యప్పుడైనను పనులు వెంటనే యారంభము కాలేదు; రామ్సేగారి యంచనాఖర్చు నింకను తగ్గించుటకు భారత