ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

మన రక్షోహృతయైన సీతను సతీమోహంబునన్ రామచం
ద్రునరేంద్రుండు గ్రహించెనంచు బలు నిందల్వల్క దౌరుల్దరా
జను గాంతారనివాసినిం సలుపదే శంకింప కారాముడున్:
మనవారల్వెఱవారలంచు సుజనుల్ న్యాయంబునొజూతుగే?

మునుగౌరవ్యులు ద్రౌపదింగినుకమై భూపాలసంఘంబు మూ
గిన పేరోలగమందు జీరలొలువం గీడ్పాటు వీక్షించుచున్
ఘనులౌ పాండవులుండరే కనలియున్ న్యాయైకబద్ధాత్ములై,
జనకా, కూడవు పక్షపాతవిధముల్ సత్యంబు బాలించుచో

అని తనుజాత వల్క విని యారటదోరముగూర గన్నులం
జినుకగ బాష్పతొయములు చెప్పెడిదేమియులేక దీనతన్
జనకుడు వెచ్చనూర్చుచు వనారిలుచుండగ జూచికూతు రీ
వనటకు హేతువేమి యని వందరుతండ్రిని బ్రశ్నచేయగన్

అక్కట! యిట్టివార్త నెటులాడుదు? నాడకపోవరాదు; నే
నక్కటికంబుమాని యెటులాత్మజభర్తను జంపనేర్తు; నం
చొక్కెడ గూతుజూచు; మఱియెక్కడ మోమునువాండు లేంచుగై
పెక్కినవానిపోల్కి నటులేగును వచ్చును, నేడ్చుబెల్లుగన్