క. | నవభాజనమున లగ్నం | |
కథాప్రారంభము
గంగాతీరమందు సకలసంపదలు గలిగి [1]పాటలిపుత్ర మను పట్టణము గలదు. ఆపట్టణము సుదర్శనుఁ డనురాజు పాలించుచుండెను. అతఁ డొకనాఁడు వినోదార్థము విద్వాంసులతో సల్లాపములు జరుపుచుండఁగా నొక బ్రాహ్మణుఁడు —
"పరువంబు కలిమి దొరతన
మరయమి యనునట్టివీనియం దొకఁ డొకఁడే
పొరయించు ననర్ధము నా
బరఁగినచో నాల్గుఁ జెప్పవలయునె చెపుమా.”
"పలుసందియములఁ దొలఁచును
వెలయించు నగోచరార్థవిజ్ఞానము లో
కుల కక్షి శాస్త్ర మయ్యది
యలవడ దెవ్వనికి వాఁడె యంధుఁడు జగతిన్. "
యని ప్రస్తావవశముగాఁ జదివెను. ఆపద్యములు రాజు విని చదువులేక మూర్ఖులయి సదా క్రీడాపరాయణులయి తిరుగుచున్నకొడుకులను దలంచుకొని యిట్లని చింతించె. “తల్లిదండ్రులు చెప్పినట్టు విని చదువుకొని లోకులచేత మంచివాఁ డనిపించంకున్నవాఁడు బిడ్డఁడుగాని తక్కినవాఁడు బిడ్డఁడా? మూర్ఖుఁడు ఎల్లకాలము తల్లిదండ్రులకు దుఃఖము పుట్టించుచున్నాడు. అట్టి
- ↑ పాటలీపుత్రమను దీర్ఘమధ్యముం గలదు.