ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 9.

485

     నగుపుణ్యులకు నెల్ల నర్హలోకంబు లీ నొడయఁ డీయిం ద్రుఁ డర్హుండు మీకు
     నర్థకామాశ్రయులయి శాఠ్యతం బరలోకము నమ్మక లోకనింద్య
తే. మైనచందంబు గైకొని యవనిసురల, నాదరింపక శ్రుతివాక్య మాక్రమించి
     తిరుగు దుర్బుద్ధు లుధ్ధతనరకవహ్నిఁ, బడుదు రందుపేక్షయ మీకుఁ బ్రభుగుణంబు.202
క. వినుఁ డిట్టివారలయి తగ, ననిశము నామీఁదితలఁపునందును నవధా
     ననిరూఢు లగుట మే లెం, దును నేదురితములు మిమ్ముఁ దొడరక యుండున్.203
వ. అని యానతిచ్చి యయ్యనంతుం డంతర్హితుం డయ్యె [1]నహితనిరాసనంబునకు
     నుల్లాసం బెసంగ వాసవాదులు నబ్జాసనుండు మున్నుగా నమ్మహావరాహమూర్తిం
     గీర్తించుచు నిజనివాసంబుల కరిగె ధరణీదేవియు దేవారాతులు విఘాతు లగుట
     నపేతవికృత యై యాత్మప్రకృతియంద నిలిచె మఱియు నయ్యమకు నతిస్థైర్యంబు
     గావింపం దలంచి.204
ఉ. పూని పురందరుం డఖలభూమిధరంబుల నెయ్యేడ న్నిజ
     స్థానములంద యుండుఁ డని సర్వసమర్థత నాజ్ఞ వెట్టి యు
     త్తానకఠోరధార మగుదారుణవజ్రము దాల్చి సంతతో
     త్తానతదీయపక్షసముదాయము మ్రోడుగఁ జెక్కె నుక్కునన్.205
క. ఆకలకలమున నొకఁ డ, న్నాకాధిపహేతిఘాతనకుఁ దప్పెను మై
     నాకం బనేకలహరీ, వ్యాకీర్ణపయోధిగర్భవాసప్రాప్తిన్.206
వ. ఇది వరాహావతారప్రకారంబు.207
చ. తనయులఁ గోరువారు వసుధాతలనాథతఁ గోరువారలున్
     విను సిరి యాయువర్థ మభివృద్ధి యశంబు జయంబుఁ గోరువా
     రు నిగమసమ్మతంబు నతిరుచ్యము లైనమహావరాహవ
     ర్తనము పఠించినన్ వినినఁ దథ్యము పొందుదు రిన్నికోర్కులున్.208
క. పితృయజ్ఞులు సురయజ్ఞులు, నతులితయోగమున నాత్మయజ్ఞులు నగువా
     రతిపుణ్యయజ్ఞమయు న, చ్యుతుఁ గొలిచినవార యగుదు రుత్తమభ క్తిన్.209
వ. నీవు భక్తిమయం బగుభావయజ్ఞంబున యజ్ఞేశ్వరు నర్చింపు మని చెప్పి వైశం
     పాయనుండు జనమేజయుతో నింక నారసింహరూపధరుం డైన చక్రధరుచరితంబు
     విను మని యి ట్లనియె.210
క. ఆదియుగంబున నసురుల, కాది యగు హిరణ్యకశిపుఁ డవిరతమదధై
     ర్యాదిగుణమ్ములఁ దనపెం, పాదిమునులు వొగడఁ జేసె నధికతపంబున్.211
వ. ఏకాదశసహస్రసంవత్సరంబులు నిర్మత్సరం బగుయోగంబున నభియోగించి
     శక్యంబు గాని యైక్యం బట్లు నిర్వహించిన యాపూర్వగీర్వాణసంయమికిం బ్రస

  1. నహితుల యుల్లాసంబు నిరాసం బైన