338
హరివంశము
ఉ. అప్పురియొప్పిదంబులు ప్రియం బెలరారఁగఁ జూచుచుం బ్రభుం
డుప్పరవీథి నేఁగి తగుయుత్తమధన్యనివేశనంబునం
దొప్పఁగఁ విశ్వకర్మరచితోజ్జ్వలబంధురసౌధనాథుపై
నప్పతగేం ద్రునోలి డిగి యక్కడనుండి సముత్సుకద్యుతిన్.227
తే. పాంచజన్యంబు సకలదిగ్భాగకంప, [1]కారిభూరిఘోషంబుగాఁ గడఁగి యొత్తు
టయును యదుసమూహముఁ బౌరచయము నద్భు, తమున సంభ్రమమున నుద్యతంబు లయ్యె.228
వ. అంత నయ్యనంతశాయి చుట్టలుం జెలులును గరుడోపరిభాగంబున శంఖచక్ర
శార్ఙ్గాదిపరికరంబు లలర సత్యభామాసమేతుం డై తేజంబున దినరాజతేజోవిరాజ
మానుం డగునాజగత్పూజితుం గని విగతశోకులుఁ బ్రమోదమేదురమానసులు
నగుచు ననేకకల్యాణతూర్యనాదంబులతో నుగ్రసేనవసుదేవబలదేవులం బురస్క
రించుకొని తదీయం బగునాదివ్యగృహంబునకుం జనుదెంచిన.229
సీ. వైనతేయుని డిగ్గి వచ్చి వృద్ధులకును గురులకు భక్తితో వరుస నెరఁగి
తమ్ములఁ గొడుకులఁ దత్సమవాత్సల్యయోగ్యులఁ బరిరంభణోపచార
ముల నాదరించి యంభోరుహనాభుండు తల్లు లేతెంచినఁ దత్ప్రమోద
ముప్పొంగ వినతుఁడై యుచితమంత్రిపురోహితాచార్యులను వల్లభాదిజనుల
ఆ. సత్కరించి నారు సంప్రీతిఁ దను వేన, ref>వేలువిధుల</ref>వేల్విధముల గారవింప నపుడ
యవ్విహంగవిభుని యఱకటిపై మణి, పర్వతాగ్ర మిష్టభంగి డించి. 230
వ. పారిజాతంబును నవతారితంబు సేసి ప్రద్యుమ్ను నాజ్ఞాపింప నతం డయ్యుత్తమ
తరువు నంతఃపురంబునకుం గొనిపోయెఁ దత్సన్నిధానంబున సకలకుకురాంధక
వరులుఁ గుమారులును దివ్యంబు లగుతమపూర్వజన్మంబులు సంస్మరించి యది
తదీయప్రభావంబుగా నెఱింగి యద్భుతంబు నొందిరి గోవర్ధనధరుం డాధరణీధర
శిఖరంబును గల్పవృక్షంబును బ్రశస్తంబు లగు నెలవులం బ్రతిష్ఠింబులు
సేయించి.231
తే. అసురకింకరకోటిచే నతులకనక, శిబికలందుఁ దెప్పించిన విబుధకన్య
లందఱను వృష్ణివృద్ధులయనుమతమునఁ, దాన వరియించువాఁడయి తత్క్షణంబ.232
చ. తొడవులఁ జీరలన్ వివిధతోషకవస్తువులం బ్రకర్ష మిం
పడరఁగఁ జేసి యందఱకు నర్హగృహావళు లేర్పడించె న
ప్పడఁతుక లత్తఱిన్ సకలబంధులు దేవులు గారవింపఁగా
నొడఁబడి వింతచంద మొకఁ డొందక చెందిరి సంప్రమోదమున్.233
- ↑ కారి భూరిఘోషంబునుగాఁగ నాగి
పట్టుట యదునమూహంబు పౌరచయము, నద్భుశము సంభ్రమంబు నుద్యతము లయ్యె.