ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

హరివంశము

     బొనుపడదేని సాహసము వొంపిరివోవఁగ నిల్చి కైదువుల్
     విను కలయన్నిటం బెనఁగు విశ్రమ మేర్పడ నేను జూచెదన్.168
క. ఆవల నాచేయంగల, యావిధమును నున్నయదియ యది మునుముట్టన్
     వావిలి చెప్పఁగ నేలా, నావుడు నవ్విభుఁడు భీష్మణస్ఫురణమునన్.169
క. తఱుచుగఁ బఱపెఁ గడిఁదియం, పఱ తోమరచక్రపరశుపరిఘచయము లే
     డ్తెఱఁ బైఁ గురిసెఁ గృపాణము, లుఱక ప్రయోగించి వైచె నొక్కట శక్తుల్.170
వ. ఇట్లు వైరిప్రయుక్తం బగు వివిధాయుధాంధకారంబు నీరంధ్రం బై కవిసిన నిర్భర
     స్థితిం బొలుపారి దైత్యారి దారుణవిక్రమం బగు చక్రంబు చేతఁ గైకొని
     వాని నాలోకించి.171
ఉ. చేయఁగ నోపినంతయును జేసితి చూచితి నేను నీవిధం
     బాయతమద్భుజాకలిత మై యిదె వచ్చె మహోగ్రచక్ర మిం
     కేమది చెప్పుమా తెలియ నిప్పటికిం బరిరక్ష యంతక
     వ్యాయతదంష్ట్రలం దగులువాఁడవు గాక సృగాల యిచ్చటన్.172
వ. అని పలికి యమ్మహాచక్రం బతనిపయిం బ్రయోగించినఁ బ్రళయసమయనిర్ఘాత
     ఘోరం బయి యడరి యది తదీయశిరంబు రెండువ్రయ్యలు సేసి క్రమ్మఱి వచ్చి
     యాసరోజాక్షు దక్షిణహస్తం బలంకరించె నంత.173
సీ. పగతుచే నిమ్మాడ్కిఁ బడి మృతిఁ బొందినఁ గలఁగి వీ డక్కడక్కడఁ బడంగ
     నంతిపురంబున నతివలు విత్రస్తకురరీవిరావసంకులము గాఁగ
     నేడ్చుచు నచ్చటి కేతెంచి రం దగ్రసతి యాత్మసుతుని నాశక్రదేవు
     నవ్వాసుదేవుని యడుగుఁ గెందమ్ములమ్రోల మ్రొక్కించి సమ్మోహవివశ
తే. యగుచు విలపింపఁ గరుణించి యవ్విభుండు, మగువ నూరార్చి సకలసామంతమంత్రి
     పౌరముఖ్యపురోహితప్రతతిఁ బిలువఁ, బనిచి రాజ్యంబు నృపతనూజునకు నిచ్చె.174
వ, ఇట్లు కరవీరపతిం బరిమార్చి తత్పదంబునం దదీయసంతతిం బ్రతిష్ఠించి.175
క. మధుమథనుఁ డాక్షణంబున, మధురగుఱిచి కదలి మేనమామఁ దగఁ దదీ
     యధరిత్రికి వీడుకొలిపి, యధికప్రమదంబుతోడ నన్నయుఁ దానున్.176
వ. మార్గంబున నైదు దివసంబులు వసియించి యాఱవనాఁటిరేపకడ పురం బనతిదూరం
     బునం గని పాంచజన్యంబు పూరించిన.177
ఉ. స్యందన[1]యుగ్యనేమిరవసమ్మిళితంబుగఁ బేర్చి రోదసీ
     కందరపూర్ణమై తదభికల్పితనాదము వర్వె దాని కా

  1. నేమియుగ్య