పూర్వభాగము. ఆ. 8.
201
నీలవర్ణు నీలం బగు మేను యరవిందధూళి పైదొరఁగిన శైవాలసంచయంబుచందం
బున నందం బగునట్లు గావించె గోవిందుమీఁద వాఁడు వెండియుఁ జండగతి
నందికొనివచ్చి చొచ్చిన నిచ్చటచ్చటఁ జరించుట మెచ్చు గా దని నట్లచ్చతురవిక్ర
ముండు సుస్థిరవిక్రముండై ప్రతిరాజరాజమండలరాహు వనందగుతనబాహువు
కుపితభోగిభోగంబునుం బోలె నిగుడ్చి యారక్కసుముఖబిలంబునం జొనిపి
[1]నాలుక మొదలంటం బట్టిన నెట్టన యతనికేలు విడిపించుకొననుం బ్రిదిలిపోవను
గఱవను నొగుల్పను శక్తుండు గాక యశక్తుం డై నక్తంచరుండు చరణతలంబుల
ధరణిఁ దాటించుచు గ్రుడ్లు వెలికుఱుక సెలవుల నురువులతోడిలాల లురుల
ఱోలుచుఁ గుత్తుక యదరఁ దోఁక యెత్తి శకృన్మూత్రంబులు విడుచుచు నడిచిపడి
యుసుఱు విడుచు కొలందికిఁ జేరి చేష్టదక్కెఁ గేశిముఖాంతర్గతం బగునయ్యదు
నందనుకరంబు మేఘమండలంబులోనఁదూఱిన ఘర్మాంతఘర్మకరునియుద్దీప్తకరంబు
పగిది శోభిల్లె నంతం గ్రమంబున జిహ్వ పెఱికి పండ్లు రాల్చి తాలువులు నురిపి
కంఠనాళంబు దెజపిసేసి యురంబుసొచ్చి యుదరంబు గలంచి ప్రేవులు చిదిమి
జీవునిం గదల్చి దామోదరదోర్దండంబు దండధరుదండంబునకుఁ బ్రతికల్పించి
నట్లు శౌర్యశిల్పంబునం బరఁగి యా చేయు నవ్విరోధికడుపులోన నంతకంతకు బలిసి
బలిసి పిక్కటిల్లినం గ్రకచంబునం బాపినట్లు రెండు వ్రయ్యలై దైతేయుకాయంబు
మహీతలంబునం బడి వజ్రధారాదళితం బైనధాత్రీధరంబుభంగి యయ్యె
నిశాచరుదశనాగ్రంబులు సోఁకి జీరలు వాఱిన వాసుదేవునిభుజంబు వన్యదంతావళ
దంతకాండక్షతంబుల భూషితం బగువృద్ధతాళద్రునుంబు ననుకరించె నివ్విధంబున
నరివధం బాపాదించి యపూర్వలక్ష్మీవిభాసితుం డై యున్నవెన్నునిం గనుంగొని.113
ఉ. గోకులవాసు లందఱును ఘోరవిపజ్జలరాశి యీఁది యు
త్సేకసమగ్రు లై యెలమిఁ జెందిరి గోపిక లేఁగుదెంచి యా
లోకనపుష్పదామముల లోలత ముంచిరి గోపవృద్ధు ల
వ్యాకులబద్ధు లై నుతిశతార్చనభంగులఁ గొల్చి రాతనిన్.114
కేశినాశంబునం బ్రీతుండై నారదుండు శ్రీకృష్ణుని నభివర్ణించుట
వ. అయ్యవసరంబున నారదుం డంతరిక్షంబునం దంతర్హితుం డై యుండి పుండరీ
కాక్షుం బేర్కొని తనపేరు చెప్పి.115
ఉ. ఎయ్యెడ గయ్యము ల్గలవొ యెవ్వరు చివ్వలకుత్సహింతురో
క్రుయ్యక యంచుఁ గోరి వెసఁ గ్రుమ్మరుచుండుదు నెందు నేను నేఁ
డియ్యెడఁ జూచితిం గలిగి యేఁకటవోవ భవత్పరాక్రమం
బయ్య కుమార యిప్పనిక యర్థి మెయిన్ దివినుండి వచ్చితిన్.116
- ↑ నాలిక