పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/270

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

229

కాంతారములు నేలఁ గలసి మాయంగ
నంత మహోద్వృత్తి నరుగుచుండఁగను,

నారదుఁడు కరిపురమునకుఁ బోవుట



అలరు వేడుకల కయ్యపుదిండితపసి 695
పొలుపొందు హస్తినాపురి కరుదెంచి
గురుకృప గాంగేయ గురుసుతకర్ణ
గురుబలాఢ్యులుతోడ కొలువున్నయట్టి
కురుపతియెదుట గ్రక్కున నిల్చుటయును
ధరణీశుఁడప్పుడు తమ్ములు దాను 700
నెదురేఁగి పూజించి హితభక్తి మ్రొక్కి
ముదమున మణిపీఠమునఁ దగ నుంచి
మునినాథ యేపని పూని వచ్చితిరి
నను దయఁబ్రోచి యానతి యియ్యవలయు
నన విని కౌరవాధ్యక్షునిమోము 705
గనుఁగొని యిట్లను గలహభోజనుఁడు,

నారదుఁడు భీమునివృత్తాంతము, ధర్మరాజాదులు సాయము వెడలుటయు, నాదిగాఁగలసంగతులు దెల్పుట



అలకాధిపతిసేన కనిలనూనునకు