పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/4

ఈ పుట ఆమోదించబడ్డది

సీతారామాంజనేయమను నీ ప్రబంధము రచించినకవి పరశు
రామపంతుల లింగమూర్తి, ఇతఁడు నియోగి బ్రాహ్మణుఁడు. రామమంత్రి
తిమ్మమాంబలకుమారుడు. ఇతనినివాసస్థలము నిజాము రాష్ట్రములోని
వరంగల్లునకుఁ జేరిన మట్టివాడ. నేఁటివఱ కీకవివంశీయులు లింగమూర్తి
కవిపాదరజముచేబవిత్రీ కృతమైన ప్రాచీనగృహముననె వసించు
చున్నారు. ఈ వంశమున నీయనకుఁ బూర్వము కవులున్నటులఁ దెలి
యదు. ఆంధ్రమున నీకవివర్యుఁడు రచించిన గ్రంథములఁ బేర్కొందుము.

1 రతిమన్మథవిలాసము
2 జీవన్ముక్తి ప్రకరణము
3 బ్రహ్మనారదసంవాదము
4 తారక యోగము
5 మానసశతకము (కందములు)
6 సీతారామాంజనేయము.

ఇందు సీతారామాంజనేయము రతీమన్మథవిలాసము అను
రెండు గ్రంథములెయించుక పెద్దవి. మిగిలిసకబ్బములు శతక ప్రాయములు.
రతిమన్మథవిలాసము మూఁడాశ్వాసముల ప్రబంధము. ఈ గ్రంథము కవి
బాల్యమున రచించినటుల నందలిభావలోపములు వ్యాకరణలోపములు
సాక్ష్యము లగుచున్నవి. గద్యములో “శ్రీ మదాంజనేయచరణకమల
సేవావిధేయ శృంగారకవితాచమత్కారధౌరేయ పరశురామపంతుల
లింగమూర్తినామధేయ ప్రణీతం బైనరతిమన్మథవిలాస మను శృంగార
ప్రబంధమందు” అని వ్రాసికొనియున్నాఁడు. దీనింబట్టి యౌవనమున
నీగ్రంథము కవి రచియించియుండునని తేలుచున్నది. సీతారామాంజ
నేయము లిఖించునప్పటికి కవిస్థితిగతులు మాఱెను. ఈతనిమానసము