పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/494

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశాశ్వాసము

433


మ.

నడుము న్నిల్వఁగనోడి యీరములలోన న్ముండ్ల గండ్లం దడం
బడుచు న్లేచుచు రెండుయోజనములుం బ్రాణాపదందాఁటి కా
ఱడవి న్నీరముపట్టు గానక నిరాహారవ్యథం జిక్కి యి
క్కడఁ బుణ్యాత్ముని నిన్నుఁ గాంచితిమి సౌఖ్యం బయ్యె భాగ్యంబునన్.

21


క.

పోయెద మిఁక నీవా
కోయల నగరంబు పొంతకుం జనవల ద
న్యాయులు వాండ్రని చెప్పుచుఁ
బోయిరి కుతుకమున జనవిభుం డిటకదలెన్.

22


ఉ.

అంతటఁ గాంచె నాతఁడు నిరంతరపర్ణఫలప్రసూనని
శ్చింతము రామపాదసరసీరుహచిహ్ననితాంతరమ్యప
ర్యంతము భూర్జపత్రలిఖితోపగతోత్సుకకిన్నరీప్రియో
దంతము పుండరీకహరిదంతదురంతము మాల్యవంతమున్.

23


క.

ఆపర్వతంబు చేరువఁ
బాపాత్ములకెల్ల నునికిప ట్టగుపుర మా
భూపాలుఁడు గాంచి తదీ
యోపాంతవనంబులోని కొయ్యన నేగెన్.

24


సీ.

ఆచ్చట నొకసరోజాకరంబునఁ గృత
        స్నానుఁడై దేవతార్చనకు నేగి
నిచ్చలుఁ గ్రొత్తమౌ నెత్తుట జొత్తిల్లు
        రంగంబు గల గుడి రాజు చొచ్చి
ఖడ్గంబు మాతులుంగ ఫలంబు నభయంబుఁ
        బునుకయు నంకుశమును వరంబు
సురియయు సూత్రంబుఁ గరముల ధరియించి
        శోణితప్రియ యున్న సొంపుచూచి