xxxiv
"విశాలాయాం నందోనామ రాజా మహా శౌర్యసంపన్నో అభూత్ , తస్యచ భానుమతీ నామ మహిషీ. తస్యచ రాజ్ఞః తస్యాం అతిప్రీతిరాసీత్. సింహాసనేపి సహైవ తయా సముపవిశేత్, నిమేషమపి తయా వినా నతిష్ఠేత్"
(విశాలా నగరమున నందుడనురాజు, గొప్పపరాక్రమము గలవాడు. అతని భార్య భానుమతి. ఆ రాజునకు భార్యయందు విశేషప్రీతికలదు. సింహాసనమునందు ఆమెతో కలసియే కూర్చుండును, ఒక నిముషమైన ఆమెను విడిచి ఉండడు.) ఈ అయిదు వాక్యములకు జక్కన 10 పద్యములను వ్రాసెను.
క. ఆ నందమహివల్లభుఁ
డానంద రసార్ద్ర హృదయుఁడై యేప్రొద్దుం
దా నగరు వెడలకుండును
భానుమతీ మోహపాశ బద్ధుండగుటన్.
క. జక్కవ కవ పెక్కువయగు
మక్కువతో రేయిఁబగలు మనుజాధీశుం
డక్కాంత దక్కనోర్వక
దక్కటి కార్యంబు లెల్లఁ దక్కిచరించున్.
శా. ఆ రామామణితోడఁ గూరిమి నతండత్యాస్థఁ గ్రీడించు సం
సారస్ఫార సుఖైక సార సురతేచ్ఛాపూర నిర్మగ్నుఁడై
యారామాంతర కేళి పర్వత గుహా హర్మ్యాంతరాళంబులం
గీరాలాప మదాలిగీత విలసత్క్రీడా నివాసంబులన్.
సీ. ఆత్మావనీమండలాసక్తిఁ బెడఁబాసి
లతనా నితంబ మండలముఁబొదువు.
వ. అంత బహుశ్రుతుండు