పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/180

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 119

రాతీర్థంబున మునిఁగి య
రాతులు విహరింతు రమరరమణీయుతులై. 80

వ. అట్లేలుచుండు నతనిరాజ్యంబున నెలకు మూఁడువానలు దళంబుగాఁ గురియ జనులెల్ల నుల్లంబుల నుల్లాసంబు వెల్లివిరియ ధనధాన్యసమృద్ధులై యున్న యెడల రత్నగర్భాతలంబున రత్నాకరగుణప్రఖ్యాపనాపరుండునుంబోలె వణీశ్వరుం డగునొక్కరత్నవ్యవహారి దూరదేశంబుననుండి యుజ్జయిని కరుడెంచి. 81

క. అంబుధి పుత్తెంచిన క
ప్పం బన రేఖాంకబిందుభంగాదికదో
షంబులఁ బొరయని పదిర
త్నంబులు గుది గుచ్చి తెచ్చి నరపతి కిచ్చెన్. 82

ఆ. వానిఁ జూచి కొలువువార లద్భుతమంద
మానవేంద్రుఁ డాత్మలోన మెచ్చి
విలువ నిశ్చయించి చులుకగా నతనికిఁ
దేటపడఁగ ధనము కోటి యిచ్చె. 83

ఆ. కోటిధనముఁ బుచ్చుకొని యగస్త్యునియుక్తి
నమరునాల్గుసాగరములయందు
నుత్తమంబు సింహళోద్భవం బటుగాన
దీనిఁ గొనుము మనుజుదేవ యనుచు. 84

వ. ఇచ్చిన నదియును బ్రభాపటలవిభాసితసభామండపంబై యంబరమణిబింబవిడంబకం బగుచున్న మానికంబు గైకొని మానవేంద్రుండు విస్మయమానమానసుండై తన్మూల్యంబు కోటి ధనం బిచ్చి యిట్టివి మఱియునుం గలవే యని యడిగిన నావర్తకుండు. 85