పుట:సర్వేపల్లి రామయ్య Vs జిల్లా కలెక్టరు చిత్తూరు సివిల్ అప్పీల్ 7461-2009 SC తీర్పు 2019-03-14.pdf/7

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7


6: ఇనాము భూములు అనగా సెక్షన్ 2 (c), 1956 ఏక్టులో క్రింది విధంగా వివరించబడినది.

“2 నిర్వచనము: ఈ ఏక్టులో, ఒక సంధర్బంలో వేరుగా కావాల్సినచో: (c) 'ప్రభుత్వంచే ఎటువంటి భూమైనా, దానికి ఇనాముగా అనుమతించిన ఎడల, రూఢ పరచినా గురించినా, అదే ఇనాము భూమి' (ఎటువంటి భూమిగాని బనగాన పల్లెలో కలిసిన ప్రాంతం, దానికి ఇనాము దానముగా చెయ్యబడినచో, అట్టి ప్రాంతపు గత పాలకుడుచే స్థిరపరచిన, గుర్తించబడిన, భూమితో చేర్చుకుని మద్రాసు ఎస్టేటు భూమి ఏక్టు, 1908 (మద్రాసు ఏక్టు 1 of 1908) కు చేరిన ఇనాము ఇందుకు వర్తించదు.

సెక్షను 2 (d), 1956 ఏక్టు నిర్వచనం ప్రకారం, ఇనాము గ్రామం అనగా అట్టి ప్రభుత్వ రికార్డులులలో ఆవిధంగా ఉద్దేశించి వుండాలి. తిరుచానూరు ఇనాము గ్రామముగా

ఉద్దేశించి వున్నారు.

7. ఏక్టు 20, 1975 ద్వారా సెక్షన్ 2A, 1956 ఏక్టుకు చేసిన సవరణ, సమకూర్చునది, క్రింది విధంగా :

“[2- A అన్ని పోరంబోకు భూములు, సమాజ భూములు మొత్తము ప్రభుత్వానికి చెంది వున్న ఇనాము భూములు, ఏక్టులో వున్న దేనికి సంబంధించక ఇనాము భూములలోని అన్ని సమాజ భూములు, పోరంబోకు, గడ్డి భూములు, పనికి రాని భూములు, అటవీ భూములు, గనులు, రాళ్ల గనులు, చెరువులు, చెరువుగట్టు, నీటిపారుదల నిర్మాణాలు, సెలయేర్లు, నదులు, చేపలచెరువులు, నదులు దాటు ప్రదేశము, అన్నీ ప్రభుత్వానికి బదలాయించబడినది, నిరాటంకముగా, యధేచ్చగా ప్రభుత్వానికే చెందును.

సెక్షన్ 2 - A, 1956 ఏక్టు ద్వారా, అన్ని అటవీభూములు, గడ్డిభూములు, సమాజ భూములు, నదీప్రవాహాలు, పోరంబోకునేలలు, చెరువులు, చెరువుగట్టు మొ.నివి నిరాటంకముగా ప్రభుత్వానివే. అందుచేత 1956 ఏళ్లు, సెక్షన్ 3 - A కు లోబడి, ఎటువంటి వ్యక్తి కౌలు గాని, నివేశనకుగాని వేరేదైనాగాని, ఏ భూమికి గాని నీటివనరుకై

గాని, హక్కు కోరరాదు. అవి నిరాటంకమై, ప్రభుత్వ స్వాధీనంలో వున్నవి.

8: రైతువారీ పట్టా: జారీ ఏక్టు అమలు జరిగిన తదుపరి, సబ్ సెక్షన్ (4) నిబంధనలు క్రింద, తాశీల్దారు, తనంతట గానీ, లేక సంస్థ వ్యక్తి దరఖాస్తు పిమ్మట సంబందిత అందరికీ, నియమ పద్ధతిలో నోటీసు జారీ చేసి, ఇనాము భూములకు పట్టా ఇచ్చుటకు, వారికి తగినంత, అవకాశం ఇచ్చి వారి వాదన విని, సంబంధిత రికార్డులు పరిశీలించి, సెక్షను 4 - A, నిబంధనల ప్రకారం, అట్టి రైతువారీ పట్టాకూ అర్హులైన, వ్యక్తులు, సంస్థలకు, విధించబడిన ఫారమ్ లో రైతు వారీ పట్టా జారీ చేయవలెను.