పుట:సర్వేపల్లి రామయ్య Vs జిల్లా కలెక్టరు చిత్తూరు సివిల్ అప్పీల్ 7461-2009 SC తీర్పు 2019-03-14.pdf/12

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12


28. మొత్తం సర్వే భూభాగాన్ని నీటి వనరుగా వర్గీకరించిన ప్రకటన, ఆధారంగా హైకోర్టు సవ్యంగా తీర్పు ఇస్తూ, మరియు, 1956 ఏక్టు, సెక్షన్ 2 - A కి లోబడి, వివాస్పద భూములు, ప్రతి బంధములు లేనివై ప్రభుత్వానికి హక్కు భుక్తములు అని చెప్పబడినది. అందుచేత, అట్టి ప్లాట్లకు రైతు వారీ పట్టా జారీ చేయుటకు, ప్రతివాదులను వత్తిడి చేయుట కుదరదు.

29: ఆలస్యము లోపములు, అనుమతి, మరియు, లేక బలమైన హక్కుతో రానటువంటి అప్పీలు దారులు, అటువంటి హక్కు వున్నట్టయితే, 1956 ఏక్టు అమలు జరిగిన సరియైన కాలంలోపల, రానట్టే కారణాల వల్ల, ఆర్టికల్ 226 కి లోబడి, ఈ కేసులో, ఎటువంటి ఉపశమనమూ కూడా తిరస్కరించ బడవల్సినదే.

30: పునరుక్తి ఐనప్పటికీ, అప్పీలుదారులు, మరియు/లేక వారి పూర్వీకులు, సోమరులు మరియు అతి నెమ్మదస్తులు అని, తిరిగి చెప్పవల్సి వస్తున్నది.

చట్టం, ఏక్టు అమలులో వచ్చిన వెనువెంటనే దరఖాస్తు చెయ్యవల్సి వుండగా,

పట్టాదారును, 1956 ఏక్టు అమలుకు రెండు దశాబ్దాలు తరువాత దరఖాస్తు చేసినారు.

31: పోరంబోకు (టేంకు) స్వాధీనం చేయరాదుననది నిశ్చలమైనదని, హైకోర్టు సింగిల్ బెంచి, మరియు ద్విసభ్య బెంచి సరిగానే నిర్ణయించినది. టేంకులకు గానీ, నీటి వనరులు, ఉపయోగంలో లేని ఎండిపోయిన నీటి వనరులు గాని, ఎటువంటి పట్టాలు జారీ చేయరాదు. మొత్తం సర్వేనంబరు 234లోని తిరుచానూరు భూమిని 'పెద్దచెరువు పోరంబోకు' (టాంకు) గా ప్రకటించిన 03.09.1984 నాటి రాజపత్రం ప్రకటనను, అప్పీలుదారులు గాని, మరియు/లేక ఆశక్తిగల పూర్వీకులు గాని, సవాలు చేయలేదు.

32: నీటి వనరులను పునరుద్ధరించాలని, వాటిని అలాగే వుంచాలన్న ఆవశ్యకతను, ఈ న్యాయస్థానము పలుమార్లు నొక్కి చెప్పటం జరిగింది, మరియు ఎవరి ఆధీనము చేయరానవి, నీటి వనరులుకు చెందిన భూములు ఎవరికీ ఇవ్వరాదని, అది ఎండి పోయినదైనా సరే, అని చెప్పటం జరిగింది. ఈ క్రింది కోర్టు దృష్టిలో ఇచ్చిన ఈ కోర్టు జడ్జిమెంట్లును అన్వయించుకొనవలెను.

1: సుసీత మరియు తమిళనాడు రాష్ట్రము (2006) 6 ఎస్.సి.సి, 543 లో ప్రకటితము.
2: ఎమ్.సీ.మెహతా (బ్ కల్ మరియు సూరజ్ కుండ్ సరస్సుల విషయము) కేంద్ర ప్రభుత్వము. (1997) 3 ఎస్.సీ.. పేజీ. 715 లో ప్రకటితము.
3: ఇంటలెక్టువల్స్ ఫోరం V. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. (2006) 3 ఎస్.సీ.సీ. 549లో ప్రకటితము.