పుట:సర్వేపల్లి రామయ్య Vs జిల్లా కలెక్టరు చిత్తూరు సివిల్ అప్పీల్ 7461-2009 SC తీర్పు 2019-03-14.pdf/11

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11

పునర్వి క్షణము అనే అసాధారణ అధికారము ఉపయోగించలేను, తప్ప, పరిపాలన సంబంధిత నిర్ణయాల విషయంలో జోక్యం తగదు.

24: ఇట్టి కేసులో తీసుకున్న నిర్ణయం, కోర్టు ఆర్డరు దృష్ట్యా, కొన్ని ఆధారములను బట్టి తీసుకొన్నది. అది విరుద్ధమైనదని, దానికి హైకోర్టుకు లభించు అసాధారణ అధికారమైన న్యాయ పునర్వీక్షణ ద్వారా జోక్యం అవసరమని కాదు. ఒక తీర్పు అంత దారుణమైనదైతే, అది అవివేకముతో బలము లేనిదే, అది అన్ని తరాలకు అది వ్యతిరేకతతో వున్నదే. ఏ ఒక్క వ్యక్తి న్యాయమైన రీతిలో వ్యవహరించునపుడు, నిర్ణయాన్ని రికార్డులోని ఆధారాలు అనుసరించి, తీసుకుని ఉండవచ్చు. ఈ కేసులోని తీర్పు అవివేకమైనది కాదు.

25: కొన్ని సందర్భాలలో, ఒక తీర్పును, చట్ట విరుద్ధమని ఆధారంతో, ఆర్టికల్ 226కు లోబడి రద్దుగాని కొట్టి వేయుటగాని చేయవచ్చు. ఇది తీర్పులో కన్పించుచున్న చట్టపరమైన తప్పిదం వున్నప్పుడు, తీర్పు యొక్క మూలాలో నికి చూసినపుడు మరియు/లేక వేరు మాటల్లో ఐతే, కన్పించుచున్న తప్పిదం, దాని వల్ల గాని, లేకుంటే, తీర్పు వేరుగా వుండేది.

26: ఆర్టికల్ 226కు లోబడి న్యాయపరమైన పునర్వీక్షణ తీర్పుపై, వ్యతిరేకంగా కాదు, కాని తీర్పు తయారుచేసే పద్ధతి పైన మాత్రమే. స్పష్టమైన, చట్ట విరుద్ధత, మరియు, లేక తీర్పు ముఖం మీదే తేట తెల్లమౌతున్న దోషము, ఏది తీర్పు మూలంలోకి వెళుతుందో, అది తీర్పును వెలువరించే పద్ధతినే బలహీనం చేయును. ఈ ప్రస్తుత కేసులో, అటువంటి ఘోరమైన చట్ట విరుద్ధత లేక తప్పిదం గాని లేనేలేవు, ఆర్టికల్ 226 కు లోబడి చేసిన అధికార ప్రయోగం, ప్రశ్నించిన తీర్పుపై వచ్చిన అప్పీలు పైన గాని, లేక తీవ్ర వివాదభరితమైన, వాస్తవ ప్రశ్నలపై గాని ఇవ్వబడిన తీర్పు కాదు.

27: కలెక్టరు వుత్తర్వులు సాక్ష్యాధారముతో వున్నవి, కనుక వాటిలో జోక్యము తగదు. హైకోర్టు చాలా సవ్యంగా, జోక్యం చేసుకొనలేదు. న్యాయ సమీక్ష అనబడే అసాధారణ అధికార వినియోగంలో, రికార్డులోని సాక్ష్యాలను పునఃపరిశీలనలో గాని, అప్పీలుదారులు గాని, వారి పూర్వీకులకు గాని, ఆశక్తులకుగాని, మతం, మహంతి వారు శాశ్వత పట్టాను ఇచ్చిన, వివాద పూరిత ప్రశ్నను గురించి న్యాయనిర్ణయం చేయుటకు గాని, లేక అట్టి తాకీదు మహంతు జారీ చేసినట్లు గాని, లేక రైతువారీ పట్టాలు నిజమైనవా కాదా అనునవి గానీ అంశములు హైకోర్టుకు సంబందించవు. ఒకవేళ, వివాదాస్పద భూమి వాస్తవంగా అది నీటి వనరు ఎండిన నీటి వనరుయొక్క అడుగు భాగమా అని నిర్ణయ ప్రకటన హైకోర్టుది కాదు. తరచుగా, నీటి వనరుల ఎండిపోయిన భూభాగంలో వ్యవసాయం సాగు జరుగును. అంత మాత్రాన ఆ భూమి యొక్క నీటి వనరు అనే స్వభావం మారిపోదు.