పుట:సకలనీతికథానిధానము.pdf/76

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

సకలనీతికథానిధానము


తే.

నరనుతుండైన శారదానంద గురువు
నిట్టికార్యంబులకు ద్రోవ యెఱుఁగుననిన
కల్లగా జంపితిని వాని గాచి నిలువ
కనిన దాఁచిన మునిగొంచు పరుగు దెంచి.

40


క.

భూపతిముందటఁ బెట్టిన
నాపరమయతీంద్రు జూచి యనియె మునీంద్రా!
నాపుత్రు వెఱ్ఱి దీర్పుము
పాపాత్ముఁడ ననుచు మదిని బట్టక యనుచున్.

41


వ.

కుమారుని నిందించి శారదానందుని ముందర నిడిన వాఁడెప్పటియట్ల 'ససేమిరా' యని పలుకుటయును.

42


క.

సమరముల శత్రునృపతుల
సమయించుట గాక నమ్మి సామీప్యమునన్
శమమున నిద్రించెడుఋ
క్షము నిలబడ ద్రోచు టదియు శౌర్యమె తలఁపన్.

43


వ.

అని శారదానందుండు పలికిన సవర్ణంబు విడిచి "సేమిరా” యనుచుండె ననుటయును.

44


క.

సేతువు జూచిన గంగా
ప్రోతస్విని గ్రుంగ భూమిసురవరహత్యా
పాతక మణఁగు గృతఘ్నత
కేతీర్థమునందు గ్రుంక నేలాఁ తలఁగున్.

45


వ.

అనుటయు రెండవ యక్షరంబును విడిచి “మిరా" "మిరా” యని పల్కుటయును.

46